D. Raja: సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యల్లో తప్పేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
D. Raja: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి వ్యాఖ్యల్లో తప్పేంటని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశ్నించారు. తిరుపతిలో జరిగిన సీపీఐ బస్సు యాత్ర ముగింపు సభలో పాల్గొ్న్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి తలనరికి తీసుకురావాలని చెప్పడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఉదయనిధి వ్యాఖ్యలపై ఢిల్లీలో చర్చకు సిద్ధమన్నారు. అమిత్ షాతో పాటు ఎవరు చర్చకు వచ్చినా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను వక్రీకరించారని.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని బీజేపీ నేతలు చదివి ఉంటే సనాతన ధర్మం గురించి అర్థమై ఉంటుందని డి.రాజా అన్నారు.
Read Also: Rithu Chowdary: విప్పి చూపించడమే పనిగా పెట్టుకున్నావా.. మరీ ఇంతగానా.. ?
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
సేవ్ ఇండియా-చేంజ్ ఇండియా నినాదంతో ప్రజల్లోకి వెళతామని డి.రాజా పేర్కొన్నారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ పేరుకేనా.. దేశంలో ఎక్కడా కనిపించడం లేదని ఆరోపించారు. మరోవైపు జీ-20 సమావేశాల పేరుతో మోడీ హడావిడి చేస్తున్నారని.. ప్రజాస్వామ్యాన్ని నరేంద్ర మోడీ ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ అంటే ఏంటో స్పష్టంగా మోడీ చెప్పగలడా అని ప్రశ్నించారు. అంబేద్కర్ రాజ్యాంగం గురించి మోడీ తెలుసుకుంటే వన్ నేషన్-వన్ ఎలక్షన్ గురించి మళ్ళీ మాట్లాడడని రాజా తెలిపారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ విధానాలు దేశప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని డి.రాజా మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. ఏపీలో రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయడం లేదని ఆరోపించారు. కమ్యూనిస్టులను ప్రజలు నమ్ముతున్నారని.. ప్రజల కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. అరెస్టులు చేసినా, జైలుకు పంపినా వెనక్కి తగ్గం..ప్రజల కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతాం
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!