Cyclone Michaung: ముంచుకొస్తున్న మిచౌంగ్… దక్షిణ కోస్తాను ముంచెత్తనున్న తీవ్ర తుఫాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ ముంచుకొస్తోంది. దక్షిణ కోస్తాను ముంచెత్తబోతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిచౌంగ్ తీవ్ర తుఫాన్ వేగం తగ్గింది. ఇది చాలా ప్రమాదకరమని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. తీవ్ర తుఫాన్… ప్రస్తుతం గంటకు 10కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతోంది. నెల్లూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. తీవ్ర తుఫాన్ నెమ్మదిగా పయనిస్తే… నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రెండు రోజులు చాలా కీలకమని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
రేపు ఉదయం బాపట్ల-దివిసీమ మధ్య తీవ్ర తుఫాన్ తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. తీరం దాటిన తర్వాత కూడా తీవ్ర తుఫాన్ ప్రభావం కొనసాగుతుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని చోట్ల కుంభవృష్టి వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నిజాంపట్నం, మచిలీపట్నం పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ నంబర్ 10 జారీ చేశారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గరిష్టంగా 115 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. కచ్చా ఇళ్లు దెబ్బతినే అవకాశం ఉందని… విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలలు ధ్వంసం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Also Read
- Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
- Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
- WFH: ఆ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం..
- Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్పవార్ ప్రశంసలు
మిచౌంగ్ తుఫాన్ నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేస్తోంది. నెల్లూరు-బాపట్ల జిల్లాల మధ్య తుఫాన్ తీరం దాటుతుండటంతో జిల్లాలో ఎడతెరపి లేకుండా భారీ వర్షలు కురుస్తున్నాయి. ఈదురుగాలులకు నెల్లూరు జిల్లాలోని పోదలకూరు, రాపూరు, చేజర్ల, కలువాయి మండలాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. రెవెన్యూ సిబ్బంది, విద్యుత్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొని చెట్లను తొలగిస్తున్నారు.
తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోయాయి. ఐదు జలాశయాలు నిండుకుండలా మారింది. దీంతో ఇవాళ రాత్రికి గోగర్భం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు అధికారులు. తిరుపతి జిల్లాలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వరద ఉధృతితో ఉప్పొంగుతోంది. నది ప్రవాహాన్ని తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని అప్రమత్తం చేయడంతో పాటు స్వర్ణముఖి కరకట్టపైకి ఎవరినీ వెళ్లకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పిచ్చటూరులోని ఆరినియార్ ప్రాజెక్టులో నాలుగు గేట్లు ఎత్తి 8వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పైభాగంలో చెరువులు, వాగులు వంకలు నిండుతుండటంతో… ముందస్తు చర్యగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్ట్ సామర్థ్యం 31 అడుగులు అయితే…. ప్రస్తుతానికి 28 అడుగులకు పైబడి నీటి నిల్వ ఉండేలా చూస్తున్నారు అధికారులు.
తాజావార్తలు
-
Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ సేల్ స్టార్ట్.. రూ. 10000 డిస్కౌంట్! 6,000mAh బ్యాటరీ, 8.1-అంగుళాల స్క్రీన్
-
Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
-
Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
-
WFH: ఆ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం..
-
Chiranjeevi : ఏపీసెట్ టాపర్ రుషి.. కలను నిజం చేసి, ల్యాప్టాప్ బహుకరించిన మెగాస్టార్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!