Freddy Cyclone: ఆగ్నేయ ఆఫ్రికాలో ఫ్రెడ్డీ తుఫాను బీభత్సం.. 326 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Freddy Cyclone: ఆగ్నేయ ఆఫ్రికాలో ఫ్రెడ్డీ తుఫాను బీభత్సం సృష్టించింది. ఫ్రెడ్డీ తుఫాను కారణంగా ఆగ్నేయ ఆఫ్రికాలోని మొజాంబిక్, మలావిలో సంభవించిన వరదల కారణంగా 300 మందికి పైగా మరణించగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తుఫాను కారణంగా 326 మంది మృతి చెందినట్లు మలావి డిపార్ట్మెంట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అఫైర్స్ తెలిపింది.దాదాపు 183,159 మంది నిరాశ్రయులయ్యారు. వేల సంఖ్యలో ప్రజలు తుఫాను సహాయ శిబిరాల్లో ఉన్నారు. బ్లాంటైర్లో వ్యాక్సిన్ కవరేజ్ చాలా తక్కువగా ఉంది కాబట్టి కలరా వ్యాప్తి చెందే ప్రమాదముందన్నారు.
ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 225 నుంచి 326కి పెరిగిందని మలావి అధ్యక్షుడు లాజరస్ చక్వేరా వాణిజ్య కేంద్రమైన బ్లాంటైర్ సమీపంలోని విధ్వంసానికి గురైన దక్షిణ ప్రాంతంలో చెప్పారు. దేశంలో 40,702 గృహాలు వరదల కారణంగా ధ్వంసమయ్యాయని తెలిపారు. ఈ వారం కుండపోత వర్షాల కారణంగా వరదలు, బురదజల్లుల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సిబ్బంది ప్రయత్నాలు కొనసాగుతున్నాయని.. ప్రపంచ దేశాలు సాయం అందించాలని చక్వేరా విజ్ఞప్తి చేశారు. ప్రాణాలతో బయటపడిన వారి కోసం 300 కంటే ఎక్కువ అత్యవసర ఆశ్రయాలను ఏర్పాటు చేశారు, అయితే సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి సైన్యం, పోలీసులను మోహరించారు. దేశంలో రెండు వారాల జాతీయ సంతాప దినాలు, అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మలావి, మొజాంబిక్, మడగాస్కర్లో ఫ్రెడ్డీ తుఫాను కారణంగా ప్రాణనష్టంపై సంతాపం వ్యక్తం చేశారు.కష్ట సమయాల్లో బాధిత దేశాల ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందన్నారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
Read Also: secunderabad: స్వప్నలోక్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం… ఆరుగురు మృతి
తుఫాను మొదటిసారిగా ఫిబ్రవరి చివరలో దక్షిణ ఆఫ్రికాలోని మడగాస్కర్, మొజాంబిక్లను తాకింది. తరువాత హిందూ మహాసముద్రం మీదుగా తిరిగి వెళ్ళింది. బుధవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఫ్రెడ్డీ ఇప్పటికీ ప్రపంచంలోని అతి పొడవైన ఉష్ణమండల తుఫానులలో ఒకటిగా మారడానికి ట్రాక్లో ఉంది. మొజాంబిక్లో, తుఫాను గత వారాల్లో కనీసం 73 మరణాలకు కారణమైంది. పదివేల మంది నిరాశ్రయులయ్యారు. మడగాస్కర్లో మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ న్యుసి కూడా మాలావి సరిహద్దులో ఉన్న జాంబేజియా ప్రావిన్స్ను సందర్శించిన తర్వాత ధ్వంసమైన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి అత్యవసర సహాయం కోసం విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
-
Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
-
Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!