Freddy Cyclone: ఆగ్నేయ ఆఫ్రికాలో ఫ్రెడ్డీ తుఫాను బీభత్సం.. 326 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Freddy Cyclone: ఆగ్నేయ ఆఫ్రికాలో ఫ్రెడ్డీ తుఫాను బీభత్సం సృష్టించింది. ఫ్రెడ్డీ తుఫాను కారణంగా ఆగ్నేయ ఆఫ్రికాలోని మొజాంబిక్, మలావిలో సంభవించిన వరదల కారణంగా 300 మందికి పైగా మరణించగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తుఫాను కారణంగా 326 మంది మృతి చెందినట్లు మలావి డిపార్ట్మెంట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అఫైర్స్ తెలిపింది.దాదాపు 183,159 మంది నిరాశ్రయులయ్యారు. వేల సంఖ్యలో ప్రజలు తుఫాను సహాయ శిబిరాల్లో ఉన్నారు. బ్లాంటైర్లో వ్యాక్సిన్ కవరేజ్ చాలా తక్కువగా ఉంది కాబట్టి కలరా వ్యాప్తి చెందే ప్రమాదముందన్నారు.
ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 225 నుంచి 326కి పెరిగిందని మలావి అధ్యక్షుడు లాజరస్ చక్వేరా వాణిజ్య కేంద్రమైన బ్లాంటైర్ సమీపంలోని విధ్వంసానికి గురైన దక్షిణ ప్రాంతంలో చెప్పారు. దేశంలో 40,702 గృహాలు వరదల కారణంగా ధ్వంసమయ్యాయని తెలిపారు. ఈ వారం కుండపోత వర్షాల కారణంగా వరదలు, బురదజల్లుల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సిబ్బంది ప్రయత్నాలు కొనసాగుతున్నాయని.. ప్రపంచ దేశాలు సాయం అందించాలని చక్వేరా విజ్ఞప్తి చేశారు. ప్రాణాలతో బయటపడిన వారి కోసం 300 కంటే ఎక్కువ అత్యవసర ఆశ్రయాలను ఏర్పాటు చేశారు, అయితే సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి సైన్యం, పోలీసులను మోహరించారు. దేశంలో రెండు వారాల జాతీయ సంతాప దినాలు, అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మలావి, మొజాంబిక్, మడగాస్కర్లో ఫ్రెడ్డీ తుఫాను కారణంగా ప్రాణనష్టంపై సంతాపం వ్యక్తం చేశారు.కష్ట సమయాల్లో బాధిత దేశాల ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందన్నారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: secunderabad: స్వప్నలోక్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం… ఆరుగురు మృతి
తుఫాను మొదటిసారిగా ఫిబ్రవరి చివరలో దక్షిణ ఆఫ్రికాలోని మడగాస్కర్, మొజాంబిక్లను తాకింది. తరువాత హిందూ మహాసముద్రం మీదుగా తిరిగి వెళ్ళింది. బుధవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఫ్రెడ్డీ ఇప్పటికీ ప్రపంచంలోని అతి పొడవైన ఉష్ణమండల తుఫానులలో ఒకటిగా మారడానికి ట్రాక్లో ఉంది. మొజాంబిక్లో, తుఫాను గత వారాల్లో కనీసం 73 మరణాలకు కారణమైంది. పదివేల మంది నిరాశ్రయులయ్యారు. మడగాస్కర్లో మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ న్యుసి కూడా మాలావి సరిహద్దులో ఉన్న జాంబేజియా ప్రావిన్స్ను సందర్శించిన తర్వాత ధ్వంసమైన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి అత్యవసర సహాయం కోసం విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!