Cyber Crime: గూగుల్ మ్యాప్ రివ్యూ వర్క్ ఆఫర్.. రూ.34 లక్షలు మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది.. మరోవైపు ఆన్లైన్ మోసాలు కూడా కొత్త తరహాలో జరుగుతున్నాయి.. ఉద్యోగం, ఉపాధి, తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం.. ఇలా అనేక రకాలుగా సైబర్ నేరగాళ్లు ఎరవేస్తున్నారు.. వారికి ఒక్కసారి చిక్కారంటే.. ఖాతా మొత్తం ఖాళీ చేస్తున్నారు.. మోసపోయిన తర్వాత అసలు విషయం తెలిసి గగ్గోలు పెడుతున్నారు బాధితులు.. ఇప్పటికే లక్షలాది మంది సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి విలవిలలాడిపోయారు.. కొందరు మోసపోయినా బయటకు చెప్పుకోలేని పరిస్థితి..
Read Also: Dasara Festival: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. దసరాకు 620 స్పెషల్ ట్రైన్లు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
తాజాగా ఏలూరులో వెలుగుచూసిన మోసానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏలూరులో ఆన్లైన్ మోసం జరిగింది.. ఏకంగా ఓ మహిళ రూ. 34 లక్షలు పోగొట్టుకుంది.. గూగుల్ మ్యాప్ రివ్యూ వర్క్ పేరుతో ఆ మహిళకు ఎరవేశాడు చీటర్.. మ్యాప్ రివ్యూ వర్క్ నిమిత్తం ఆఫర్ పేరుతో ఓ లింక్ను సదరు మహిళకు పంపించాడు.. పెట్టిన ప్రతి పైసాకి 40 శాతం లాభం పొందొచ్చు అంటూ మెసేజ్ పెట్టాడు.. అయితే తన ప్లాన్లో భాగంగా మొదట ఆ మహిళకు నమ్మకం కలిగేలా చేశారు సైబర్ మోసగాళ్లు.. మొదట 500 రూపాయలు పే చేసిన సదరు మహిళకు 40 శాతం లాభం వచ్చినట్టు చూపించారు.. దీంతో.. డబ్బులు భారీగా సంపాదించవచ్చు అనే ఆలోచనలోకి వెళ్లిపోయింది ఆ మహిళ.. దఫదఫాలుగా రూ.34 లక్షల 11 వేల 792 రూపాయలు వారికి ఇస్తూ పోయింది.. అయితే.. ఎంతకీ తన డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించి గగ్గోలు పెడుతూ.. పోలీసులను ఆశ్రయించారు బాధితురాలు. బాధితురాలు కొత్తకోట అన్నపూర్ణ ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!