RBI: ఫోన్ పేకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా.. ఎందుకంటే.
- ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కు
- సంబంధించి నియమాలు పాటించని ఫోన్ పే
- రూ. 21లక్షల జరిమానా విధించిన ఆర్బీఐ
- గతంలో జరిమానాలు విధించిన ఆర్బీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI ఆదేశాలను పాటించలేదని … సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాలను పర్యవేక్షక పరిశీలనల ఆధారంగా, ఆ ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపమని సలహా ఇస్తూ PhonePeకి నోటీసు జారీ చేసినట్లు అపెక్స్ బ్యాంక్ తెలిపింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కు సంబంధించి కొన్ని నిబంధనలు పాటించని కారణంతో ఫోన్ పే సంస్థకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 21 లక్షల జరిమానా విధించింది.
‘ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్’ (PPIs) కు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించనందుకు PhonePe లిమిటెడ్పై 21 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం తెలిపింది. అక్టోబర్ 2023 నుండి డిసెంబర్ 2024 వరకు దాని కార్యకలాపాలకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ కంపెనీపై చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించిందని RBI ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
పూర్తి వివరాల్లోకి వెళితే… అక్టోబర్ 2023 నుండి డిసెంబర్ 2024 వరకు ఫోన్ పే కార్యకలాపాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ తనిఖీలు నిర్వహించింది. దీంతో ఫోన్ పేలో ఉన్న లోపాలను ఆర్బీఐ గుర్తించింది. RBI ఆదేశాలను పాటించలేదని, ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చెప్పాలని.. PhonePeకి నోటీసు జారీ చేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది.
RBI తనిఖీలో PhonePe ఎస్క్రో అకౌంట్లో కొన్ని రోజులు నిధులు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. వ్యాపారులకు చెల్లించాల్సిన మొత్తం కంటే ఎస్క్రో అకౌంట్లో తక్కువ బ్యాలెన్స్ ఉన్నట్లు గమనించింది. అకౌంట్లో నిధులు మొత్తం తక్కువగా ఉన్న విషయాన్ని RBIకి వెంటనే తెలియజేయడంలో కూడా PhonePe విఫలమైంది. RBI ఈ జరిమానా నిబంధనల ఉల్లంఘన వల్ల మాత్రమే విధించినట్లు స్పష్టం చేసింది. దీంతో PhonePe వినియోగదారుల లావాదేవీలపై ఏమాత్రం ప్రభావం పడదని వెల్లడించింది. PhonePeపై జరిమానాలు ఇదే మొదటిసారి కాదు. 2019లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ (FPI) నిబంధనలను పాటించనందుకు 1 కోటి జరిమానా విధించగా, 2020లో ఇతర నియంత్రణ ఉల్లంఘనలపై 1.39 కోట్ల జరిమానా విధించింది.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!