RBI: ఫోన్ పేకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా.. ఎందుకంటే.
- ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కు
- సంబంధించి నియమాలు పాటించని ఫోన్ పే
- రూ. 21లక్షల జరిమానా విధించిన ఆర్బీఐ
- గతంలో జరిమానాలు విధించిన ఆర్బీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI ఆదేశాలను పాటించలేదని … సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాలను పర్యవేక్షక పరిశీలనల ఆధారంగా, ఆ ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపమని సలహా ఇస్తూ PhonePeకి నోటీసు జారీ చేసినట్లు అపెక్స్ బ్యాంక్ తెలిపింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కు సంబంధించి కొన్ని నిబంధనలు పాటించని కారణంతో ఫోన్ పే సంస్థకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 21 లక్షల జరిమానా విధించింది.
‘ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్’ (PPIs) కు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించనందుకు PhonePe లిమిటెడ్పై 21 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం తెలిపింది. అక్టోబర్ 2023 నుండి డిసెంబర్ 2024 వరకు దాని కార్యకలాపాలకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ కంపెనీపై చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించిందని RBI ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
- PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
పూర్తి వివరాల్లోకి వెళితే… అక్టోబర్ 2023 నుండి డిసెంబర్ 2024 వరకు ఫోన్ పే కార్యకలాపాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ తనిఖీలు నిర్వహించింది. దీంతో ఫోన్ పేలో ఉన్న లోపాలను ఆర్బీఐ గుర్తించింది. RBI ఆదేశాలను పాటించలేదని, ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చెప్పాలని.. PhonePeకి నోటీసు జారీ చేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది.
RBI తనిఖీలో PhonePe ఎస్క్రో అకౌంట్లో కొన్ని రోజులు నిధులు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. వ్యాపారులకు చెల్లించాల్సిన మొత్తం కంటే ఎస్క్రో అకౌంట్లో తక్కువ బ్యాలెన్స్ ఉన్నట్లు గమనించింది. అకౌంట్లో నిధులు మొత్తం తక్కువగా ఉన్న విషయాన్ని RBIకి వెంటనే తెలియజేయడంలో కూడా PhonePe విఫలమైంది. RBI ఈ జరిమానా నిబంధనల ఉల్లంఘన వల్ల మాత్రమే విధించినట్లు స్పష్టం చేసింది. దీంతో PhonePe వినియోగదారుల లావాదేవీలపై ఏమాత్రం ప్రభావం పడదని వెల్లడించింది. PhonePeపై జరిమానాలు ఇదే మొదటిసారి కాదు. 2019లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ (FPI) నిబంధనలను పాటించనందుకు 1 కోటి జరిమానా విధించగా, 2020లో ఇతర నియంత్రణ ఉల్లంఘనలపై 1.39 కోట్ల జరిమానా విధించింది.
తాజావార్తలు
-
Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!