Cyber Fraud : సీఎం ఓఎస్డీ పేరుతో సైబర్ వల.. వ్యాపారులకు ఉచ్చు..!
- చీఫ్ మినిస్టర్ ఓఎస్డీ అంటూ వ్యాపారులకు వల
- సైబర్ నేరగాళ్ల మీద కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
- సీఎం ఆఫీసు పేరుతో వ్యాపార సంస్థళ యజమానులకు ఈ మెయిల్స్, వాట్సాప్ మెసేజ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud : హైదరాబాద్లో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. చీఫ్ మినిస్టర్ ఓఎస్డీ (ప్రత్యేక అధికారి) పేరుతో వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజ్ల ద్వారా వల విసురుతున్నారు. ఈ నేరాలపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయబడింది. సీఎం కార్యాలయం పేరుతో వ్యాపార సంస్థల యజమానులకు ఈమెయిల్స్ , వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయని, వాటి ద్వారా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు సీఎం ఓఎస్డీ పేరును వాడుకుని, వివిధ వ్యాపార సంస్థల యజమానులను సంప్రదిస్తున్నారు. ప్రభుత్వ పనులకు సంబంధించిన కాంట్రాక్టులు ఇప్పిస్తామని, లేదా ఇతరత్రా సహాయం చేస్తామని నమ్మబలుకుతూ, వారి నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు.
Mahendran : మణిశర్మ చేతుల మీదుగా ‘వసుదేవ సుతం’ గ్లింప్స్ రిలీజ్..
Also Read
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
ఈ మోసపూరిత వ్యవహారంపై అజిత్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, ఈమెయిల్స్ , వాట్సాప్ మెసేజ్లను పంపిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేరగాళ్ల వెనుక పెద్ద ముఠానే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వ్యాపార సంస్థల యజమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సీఎం కార్యాలయం పేరుతో వచ్చే అనుమానాస్పద ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజ్లకు స్పందించవద్దని సూచిస్తున్నారు. ఎవరైనా ఇలాంటి మోసపూరిత ప్రయత్నాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సీఎం కార్యాలయం పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు తెలిపారు.
Pavankalyan : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రిలీజ్ కోసం న్యూ ప్లాన్ ..!
తాజావార్తలు
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
-
Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
-
Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..