Cyber Fraud : సీఎం ఓఎస్డీ పేరుతో సైబర్ వల.. వ్యాపారులకు ఉచ్చు..!
- చీఫ్ మినిస్టర్ ఓఎస్డీ అంటూ వ్యాపారులకు వల
- సైబర్ నేరగాళ్ల మీద కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
- సీఎం ఆఫీసు పేరుతో వ్యాపార సంస్థళ యజమానులకు ఈ మెయిల్స్, వాట్సాప్ మెసేజ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud : హైదరాబాద్లో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. చీఫ్ మినిస్టర్ ఓఎస్డీ (ప్రత్యేక అధికారి) పేరుతో వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజ్ల ద్వారా వల విసురుతున్నారు. ఈ నేరాలపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయబడింది. సీఎం కార్యాలయం పేరుతో వ్యాపార సంస్థల యజమానులకు ఈమెయిల్స్ , వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయని, వాటి ద్వారా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు సీఎం ఓఎస్డీ పేరును వాడుకుని, వివిధ వ్యాపార సంస్థల యజమానులను సంప్రదిస్తున్నారు. ప్రభుత్వ పనులకు సంబంధించిన కాంట్రాక్టులు ఇప్పిస్తామని, లేదా ఇతరత్రా సహాయం చేస్తామని నమ్మబలుకుతూ, వారి నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు.
Mahendran : మణిశర్మ చేతుల మీదుగా ‘వసుదేవ సుతం’ గ్లింప్స్ రిలీజ్..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈ మోసపూరిత వ్యవహారంపై అజిత్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, ఈమెయిల్స్ , వాట్సాప్ మెసేజ్లను పంపిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేరగాళ్ల వెనుక పెద్ద ముఠానే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వ్యాపార సంస్థల యజమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సీఎం కార్యాలయం పేరుతో వచ్చే అనుమానాస్పద ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజ్లకు స్పందించవద్దని సూచిస్తున్నారు. ఎవరైనా ఇలాంటి మోసపూరిత ప్రయత్నాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సీఎం కార్యాలయం పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు తెలిపారు.
Pavankalyan : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రిలీజ్ కోసం న్యూ ప్లాన్ ..!
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!