Cyber Fraud : సీఎం ఓఎస్డీ పేరుతో సైబర్ వల.. వ్యాపారులకు ఉచ్చు..!
- చీఫ్ మినిస్టర్ ఓఎస్డీ అంటూ వ్యాపారులకు వల
- సైబర్ నేరగాళ్ల మీద కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
- సీఎం ఆఫీసు పేరుతో వ్యాపార సంస్థళ యజమానులకు ఈ మెయిల్స్, వాట్సాప్ మెసేజ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud : హైదరాబాద్లో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. చీఫ్ మినిస్టర్ ఓఎస్డీ (ప్రత్యేక అధికారి) పేరుతో వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజ్ల ద్వారా వల విసురుతున్నారు. ఈ నేరాలపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయబడింది. సీఎం కార్యాలయం పేరుతో వ్యాపార సంస్థల యజమానులకు ఈమెయిల్స్ , వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయని, వాటి ద్వారా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు సీఎం ఓఎస్డీ పేరును వాడుకుని, వివిధ వ్యాపార సంస్థల యజమానులను సంప్రదిస్తున్నారు. ప్రభుత్వ పనులకు సంబంధించిన కాంట్రాక్టులు ఇప్పిస్తామని, లేదా ఇతరత్రా సహాయం చేస్తామని నమ్మబలుకుతూ, వారి నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు.
Mahendran : మణిశర్మ చేతుల మీదుగా ‘వసుదేవ సుతం’ గ్లింప్స్ రిలీజ్..
Also Read
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
- England Team: 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్.. 20 వికెట్లు వారి ఖాతాలోనే..
- Paddy Bonus Rules: సన్న వడ్ల రైతులకు అలర్ట్.. రూ.500 బోనస్ రావాలంటే సెప్టెంబర్ 10లోపు ఈ పని చేయాల్సిందే..
ఈ మోసపూరిత వ్యవహారంపై అజిత్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, ఈమెయిల్స్ , వాట్సాప్ మెసేజ్లను పంపిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేరగాళ్ల వెనుక పెద్ద ముఠానే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వ్యాపార సంస్థల యజమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సీఎం కార్యాలయం పేరుతో వచ్చే అనుమానాస్పద ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజ్లకు స్పందించవద్దని సూచిస్తున్నారు. ఎవరైనా ఇలాంటి మోసపూరిత ప్రయత్నాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సీఎం కార్యాలయం పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు తెలిపారు.
Pavankalyan : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రిలీజ్ కోసం న్యూ ప్లాన్ ..!
తాజావార్తలు
-
H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
-
HYDRAA : మురుగు చెరువు నుంచి టూరిజం స్పాట్.. సున్నం చెరువు సరికొత్త లుక్.!
-
150 Words on One Sticky Note: ఒకే స్టిక్కీ నోట్పై 150 పదాలు.. భారత సంతతి క్లౌడ్ ఇంజనీర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు!
-
AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
-
England Team: 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్.. 20 వికెట్లు వారి ఖాతాలోనే..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?