Telangana Storms: ఈదురు గాలులకు 20 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ చిన్నారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Storms: రాష్ట్రంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. దీంతో జనజీవనం అతలాకుతలమైంది. మెదక్ జిల్లాలో ఊయలలో ఆడుతున్న చిన్నారి ఈదురు గాలులకు ఎగిరి పక్కనే ఉన్న డాబాపై పడి మృతి చెందగా, సిద్దిపేట జిల్లాలో చెట్టు కూలడంతో టెన్త్ విద్యార్థి మృతి చెందాడు. వడగళ్ల వానతో సిద్దిపేట జిల్లాలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వివరాలు.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేట జాజితండాకు చెందిన మాలోత్ మాన్సింగ్, మంజుల దంపతులకు సీత, గీత అనే కవలలు ఉన్నారు. దంపతులు కూలి పనులకు వెళ్లగా పిల్లలు, అమ్మమ్మ ఇంట్లోనే ఉన్నారు. మంగళవారం ఈదురు గాలులు, వర్షం కారణంగా ఇంటి పైకప్పు ఒక్కసారిగా లేచిపోయింది. ఇంట్లో చీరకట్టులో ఆడుకుంటున్న సీత (5) కూడా రేకులతోపాటు ఎగిరి 20 మీటర్ల దూరంలో ఉన్న మరో డాబా ఇంటిపై పడింది. చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం నర్సాపూర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.
Read also: SSC Recruitment 2024 : సింగరేణిలో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
Also Read
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
- Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
మరోవైపు పదో తరగతి పరీక్షకు హాజరైన ఎం వెంకటేష్ (16) మృతి చెందాడు. జిల్లావ్యాప్తంగా సాయంత్రం వరకు వర్షం కురువడంతో వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, మామిడి, కూరగాయలు తదితర పంటలు భారీ స్థాయిలో దెబ్బతిన్నాయి. ఈదురు గాలుల కారణంగా జిల్లావ్యాప్తంగా పలుచోట్ల చెట్లు, విద్యుత్ నేలకూలాయి. మాజీ మంత్రి హరీశ్రావు తన నియోజకవర్గం నుంచి రైతులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు తక్షణ సాయంగా ఎకరాకు రూ.10వేలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మరోవైపు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా వర్షాలు, వడగళ్ల వానలు కురిశాయి. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు వెంటనే అంచనా వేయలేకపోతున్నారు.
Congress : కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఏఐ
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
-
Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
-
India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
-
Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. జీతంలో 1.5% కట్.!
-
Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!