Crime News: వారం రోజులుగా ఇంట్లోనే మృతదేహం.. గుర్తించలేని స్థితిలో తల్లి, సోదరుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The body has been in the house for a week: కుటుంబంలోని ఓ వ్యక్తి చనిపోయినా.. తల్లి, సోదరుడు గుర్తించలేకపోయారు. మృతదేహం ఇంట్లోనే కుళ్లిపోయి, పురుగులు పడుతున్నా.. ఎప్పటిలానే వారు సాధారణ జీవితం గడిపారు. దుర్వాసన వస్తుండగా.. పక్కింటి యువకులు లోపలి వెళ్లి చూడగా అసలు విషయం వెలుగుచూసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని చింతల్లో చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం వెంకటపురం గ్రామానికి చెందిన ముక్కు రాధాకుమారి (45) 5 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి చింతల్లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. రాధాకుమారి 20 ఏళ్ల క్రితం విడాకులు తీసుకోగా.. అప్పటి నుంచి ఆమె సోదరుడు పవన్, తల్లి విజయలక్ష్మితో కలిసి చింతల్లోనే ఉంటున్నారు. కొన్నేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న రాధాకుమారికి వైద్యం చేయించినా పరిస్థితి మెరుగుపడలేదు. రెండేళ్లుగా ఇంట్లోనే ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
Also Read
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
- Virat Kohli - Rohit Sharma: కోహ్లీ-రోహిత్కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
- IND W vs ENG W: వరల్డ్కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!
- Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
రాధాకుమారి సోదరుడు పవన్ ఓ ఫార్మా కంపెనీలో పనిచేసేవాడు. తల్లి మానసిక స్థితి బాగోలేక పోవడం, అక్క అనారోగ్యంతో బాధపడుతుండడంతో.. ఇద్దరినీ ఆయనే చూసుకుంటున్నారు. అయితే పవన్ మానసిక స్థితి కూడా క్షీణించడంతో రెండు నెలల క్రితం కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో తరచూ బయటకు వచ్చే పవన్.. పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు. వారం రోజుల క్రితం సోదరి రాధాకుమారి మరణించినా గుర్తించలేదు. రోజులు గడిచినా సోదరి మృతి చెందినట్లు పవన్ గుర్తించలేక పోయాడు.
Also Read: Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
అప్పుడప్పుడు పవన్ బైక్ తీసుకునే పక్కింట్లో ఉండే యువకులు మంగళవారం రాత్రి ఇంటి తలుపు తట్టారు. పవన్ తలుపులు తీయడంతో.. వారికి తీవ్ర దుర్వాసన వచ్చింది. ఏంటని ఇంటి లోపలికి వెళ్లిచూడగా.. మంచంపై రాధాకుమారి మృతిచెంది ఉంది. మీ అక్క చనిపోయిందని చెప్పినా.. పవన్ స్పందించలేదు. దాంతో యువకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జీడిమెట్ల పోలీసులు ఇంటికి వచ్చి.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
-
PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. కొంచం ఇష్టం.. కొంచం కష్టం
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
-
Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
-
Hero Flex Fuel Bikes: హీరో మోటోకార్ప్ సంచలనం.. దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్స్ స్ప్లెండర్, HF డీలక్స్ మార్కెట్లోకి..
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!