Sachin Tendulkar: సచిన్ నయా ఇన్నింగ్స్ షురూ.. క్రికెట్ దిగ్గజం లక్ష్యం అదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sachin Tendulkar recognised as National Icon of EC: భారత ఎన్నికల సంఘం (ఈసీ) నేషనల్ ఐకాన్గా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బుధవారం నియమితులయ్యారు. ముఖ్యంగా పట్టణ మరియు యువత ఓటింగ్ పెంచేందుకు ప్రచారకర్తగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. నేడు ఢిల్లీలో సచిన్, ఎన్నికల ప్యానెల్ మధ్య ఎంఓయూ కుదిరింది. మూడేళ్ల ఒప్పందంలో భాగంగా రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా క్రికెట్ దిగ్గజం సచిన్ పని చేయనున్నారు.
నియామకం అనంతరం సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ… భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని, మన ఓటు హక్కును వినియోగించుకోవడం మన ప్రధాన బాధ్యత అని అన్నారు. ఓటర్లు బాధ్యతతో తప్పనిసరిగా ఓటేయాలని తన కర్తవ్యాన్ని మొదలుపెట్టారు. సచిన్ టెండూల్కర్ కొత్త ఇన్నింగ్స్ సక్సెస్ అవుతుందని ఎన్నికల చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
Also Read
- Supreme Court: CJP నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
- AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
- SCO Summit 2026: సింధు జలాల ఒప్పందంపై షాబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
- CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
2024లో అక్టోబరు-నవంబర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరియు లోక్సభ ఎన్నికలను నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఈ ఎన్నికలలో ఎక్కువ మంది ఓటర్లు భాగస్వామ్యం అయ్యేలా వారిని ప్రోత్సహించేందుకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ను నేషనల్ ఐకాన్గా ఈసీ నియమించింది. సచిన్ నయా ఇన్నింగ్స్ నేటితో షురూ అయింది. క్రికెట్లో వంద సెంచరీలు, ఎన్నెన్నో అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్న సచిన్.. ఓటింగ్పై అవగాహన పెంచేందుకు రంగంలోకి దిగారు.
Also Read: Software Job: గంట పనికి కోట్లలో జీతం.. ఇదెలా సాధ్యం?
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ఓటర్లను ప్రేరేపించేందుకు ఈసీ పలు రంగాలకు చెందిన ప్రముఖ భారతీయులను ‘నేషనల్ ఐకాన్’గా పేర్కొంటుంది. గత సంవత్సరం నటుడు పంకజ్ త్రిపాఠిని ఈసీ నేషనల్ ఐకాన్గా పేర్కొంది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, బాక్సర్ మేరీకోమ్ వంటి సెలబ్రెటీలను నేషనల్ ఐకాన్గా ఈసీ గుర్తించింది. ఈసారి ఈ బాధ్యతను సచిన్ టెండూల్కర్కు అప్పగించింది.
తాజావార్తలు
-
Supreme Court: CJP నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
-
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
-
SCO Summit 2026: సింధు జలాల ఒప్పందంపై షాబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
-
Pujara Team: కోహ్లీ, సచిన్లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్కే ఓటు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!