Sachin Tendulkar: సచిన్ నయా ఇన్నింగ్స్ షురూ.. క్రికెట్ దిగ్గజం లక్ష్యం అదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sachin Tendulkar recognised as National Icon of EC: భారత ఎన్నికల సంఘం (ఈసీ) నేషనల్ ఐకాన్గా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బుధవారం నియమితులయ్యారు. ముఖ్యంగా పట్టణ మరియు యువత ఓటింగ్ పెంచేందుకు ప్రచారకర్తగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. నేడు ఢిల్లీలో సచిన్, ఎన్నికల ప్యానెల్ మధ్య ఎంఓయూ కుదిరింది. మూడేళ్ల ఒప్పందంలో భాగంగా రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా క్రికెట్ దిగ్గజం సచిన్ పని చేయనున్నారు.
నియామకం అనంతరం సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ… భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని, మన ఓటు హక్కును వినియోగించుకోవడం మన ప్రధాన బాధ్యత అని అన్నారు. ఓటర్లు బాధ్యతతో తప్పనిసరిగా ఓటేయాలని తన కర్తవ్యాన్ని మొదలుపెట్టారు. సచిన్ టెండూల్కర్ కొత్త ఇన్నింగ్స్ సక్సెస్ అవుతుందని ఎన్నికల చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
2024లో అక్టోబరు-నవంబర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరియు లోక్సభ ఎన్నికలను నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఈ ఎన్నికలలో ఎక్కువ మంది ఓటర్లు భాగస్వామ్యం అయ్యేలా వారిని ప్రోత్సహించేందుకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ను నేషనల్ ఐకాన్గా ఈసీ నియమించింది. సచిన్ నయా ఇన్నింగ్స్ నేటితో షురూ అయింది. క్రికెట్లో వంద సెంచరీలు, ఎన్నెన్నో అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్న సచిన్.. ఓటింగ్పై అవగాహన పెంచేందుకు రంగంలోకి దిగారు.
Also Read: Software Job: గంట పనికి కోట్లలో జీతం.. ఇదెలా సాధ్యం?
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ఓటర్లను ప్రేరేపించేందుకు ఈసీ పలు రంగాలకు చెందిన ప్రముఖ భారతీయులను ‘నేషనల్ ఐకాన్’గా పేర్కొంటుంది. గత సంవత్సరం నటుడు పంకజ్ త్రిపాఠిని ఈసీ నేషనల్ ఐకాన్గా పేర్కొంది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, బాక్సర్ మేరీకోమ్ వంటి సెలబ్రెటీలను నేషనల్ ఐకాన్గా ఈసీ గుర్తించింది. ఈసారి ఈ బాధ్యతను సచిన్ టెండూల్కర్కు అప్పగించింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!