CPI Narayana: ధరణితో కేసీఆర్ ఓటమి..! భూ హక్కు చట్టంతో జగన్కి ఓటమి ఖాయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana: తెలంగాణలో ధరణి చట్టంతో కేసీఆర్ ఓటమిపాలయ్యారు.. ఆంధ్రప్రదేశ్లో భూ హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్)తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం అని జోస్యం చెప్పారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ ఫొటో పెట్టడానికి మినహా రైతుల పాస్బుక్ ఎందుకు పనికి రాకుండా చేశాడు అని ఫైర్ అయ్యారు. పాస్బుక్లో సీఎం జగన్ ఫొటో చాలా బాగుందని సెటైర్లు వేసిన ఆయన.. పాస్బుక్ లోపల చదివా.. లాస్ట్ పేజీ చూస్తే.. ఇది తనఖాపెట్టడానికి ఉపయోగపడదు.. ఎలాంటి హామీకి ఇది ఉపయోగపడదు అని రాసిఉంది. దీనిపై రెవెన్యూ అధికారులను అడిగితే.. అవి వేటికి పనికిరావు సారు.. ! అని చెప్పారన్నారు. అంతదానికోసం.. కొత్త పాస్ బుక్కులు ఎందుకు? అని ప్రశ్నించారు.
Read Also: Barron Trump: డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడి పొలిటికల్ ఎంట్రీ
Also Read
ఇక, మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నుంచి ఏపీ రాజకీయాలను చూస్తున్నాను జగన్మోహన్ రెడ్డి లాంటి కర్కోటక సీఎంను ఇప్పటి వరకు చూడలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు నారాయణ. పరిపాలన చేతకాని సీఎం జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. ఇక, గంగమ్మ జాతరలో బూతు పురాణాలలో గంగమ్మను సాగనంపినట్లు.. మంత్రి రోజాను ప్రజలు ఓడించి సాగనంపుతారు అని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు డబ్బులు పంచుతున్నట్లు మా నాయకులు కరపత్రాలు కూడా పంచలేకపోతున్నారు అంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ. కాగా, ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పెద్ద రచ్చ జరుగుతోన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!