సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో భారత దేశ మొట్ట మొదటి లా ఎన్ఫోర్స్మెంట్ CISO ( చీఫ్ ఇన్ఫర్ మేషన్ సెక్యూరిటీ ఆఫీస్ కౌన్సిల్ )ను తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ ప్రన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, పలువురు ఐటీ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ కమిషన్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. సైబర్ నేరాలు ఛాలెంజ్ గా మారాయి.. దేశం నలుమూలలా నుండి ఎన్నో కోణాల్లో సైబర్ దాడులు జరుగుతున్నాయి.. దేశంలోనే మొదటి లా ఎన్ఫోర్స్మెంట్ CISCO కౌన్సిల్ సైబరాబాద్ లో ప్రారంభం అవ్వడం సంతోషంగా ఉంది అని ఆయన తెలిపారు. సైబర్ నేరాలు చేదించడానికి లా ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ( CISO) ఎంతగానో దోహదపడుతుంది అని స్టీఫెన్ రవీంద్ర అన్నారు.
Read Also: Unstoppable Limited Edition: బాలయ్య దిగుతున్నాడు.. గెట్ రెడీ రా అబ్బాయిలూ!
సైబర్ నేరాలు గుర్తించడం, నేరగాళ్లు విచారణ, దర్యాప్తు చేసి శిక్ష పడేలా చేయడం లా ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ముఖ్య ఉద్దేశ్యం అని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సైబర్ క్రైమ్ సెక్యురిటి కోసమే, డిజిటల్ సెక్యూర్ కోసమే ఈ కౌన్సిల్.. సైబర్ త్రెట్నింగ్స్ పై తెలంగాణ పోలీస్ శాఖ అలెర్ట్ గా ఉంది.. తెలంగాణ రాష్ట్రాన్ని సైబర్ సేఫ్ సిటీగా తీర్చిదిద్దడం లా ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ( CISO) ముఖ్య ఉద్దేశ్యం అని ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ లో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అనేక ఇండస్ట్రీ కు సైబర్ ముప్పు నుంచి టెక్నాలజీ సహాయంతో కాపాడ గలుగుతున్నాము అని స్టీఫెన్ రవీంద్ర చెప్పుకొచ్చారు. ఐటీ ఇండస్ట్రీ (ఎంఎస్సి మానిటరింగ్ ఆఫ్ సెక్యూరిటీ వింగ్) ద్వారా సేఫ్ గా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతామని సీపీ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. ఇంటలిజెన్స్, లీగల్ రెగ్యులేటరీ, ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఆయా విభాగాలు పూర్తి సమన్వయం ద్వారా సైబర్ నేరాలు అదుపు చేస్తున్నాం.. సైబర్ ఫిర్యాదులు ఏమైనా ఉంటే.. 1930కి కాల్ చెయ్యండి అని ఆయన అన్నారు.