సోషల్ నెట్వర్క్ లలో ప్రతిరోజు చాలా వీడియోలు కొత్తగా వైరల్ గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాటిలో కొన్ని భయాందోళనలకు కారణమవుతాయి. మరికొన్నివీడియోలు ఏకంగా మరణ భయాన్ని చూపుతాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Tollywood Heros : దివాళీపై కన్నేసిన స్టార్ హీరోలు .. ఆ సినిమాల వార్ షురూ..
సోషల్ నెట్వర్క్ లలో వైరల్గా మారిన వీడియోను పరిశీలిస్తే., ఓ చోట ముగ్గురు అమ్మాయిలు ఏదో తింటూ కూర్చున్నారు. ఇంతలో రెండు పెద్ద ఎద్దులు పరుగెత్తుకొచ్చాయి. దాంతో ఒక్కసారిగా ఏమవుతుందో అని తేరుకొనేలోపే.. ఒక అమ్మాయి అక్కడి నుండి పారిపోగా., మరో అమ్మాయి సమీపంలోని దుకాణం అద్దాలను ఢీకొట్టింది. ఇక మూడవ అమ్మాయి పెద్దగా ఉన్న ఓ ఎద్దు కాళ్ల వద్ద పడింది.
ఆ సమయంలో ఆ ఎద్దు అమ్మాయిని తొక్కింది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు సకాలంలో స్పందించి బాలికను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా., నెటిజన్స్ కొందరు ఆ అమ్మాయిలు మరణం అంచు వరకు వెళ్లి వచ్చారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు.. మీరు ఏమి అవ్వకుండా బయట పడ్డారు.. మీరు అదృష్టవంతులు అంటూ కామెంట్స్ చేసారు.
😰😰😰
pic.twitter.com/SZCdo3f20O— Ghar Ke Kalesh (@gharkekalesh) May 17, 2024