Shocking: పిల్లలను కని అమ్మడమే వారి పని.. ఇప్పటికి ఎంతమందో తెలుసా..
Shocking: మహారాష్ట్రలోని నాగపూర్లో దారుణం వెలుగులోకి వచ్చింది. 51నెలల్లో ఐదుగురికి జన్మనిచ్చిన దంపతులు.. కన్న శిశువులనే అమ్మారు. ఎనిమిది నెలల చిన్నారి అపహరణ కేసులో పోలీసులు దంపతులను అరెస్ట్ చేసి విచారిస్తుండగా నమ్మలేని నిజం బయటకు పొక్కింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ కు చెందిన యోగేంద్ర ప్రజాపతి, రీటా అనే మహిళను 2017లో పెళ్లి చేసుకున్నాడు. 2018లో వారికి తొలుత పాప పుట్టగా 25వేల రూపాయలకు చిన్నారిని అమ్మేశారు. అంతే కాకుండా వారు జన్మనిచ్చిన మరో ఇద్దరు పిల్లలను కూడా ఇలాగే కనడం ఆ తర్వాత అమ్మడం ప్రారంభించారు. ఇదేదో బిజినెస్ బాగుందని భావించిన ఆ జంట ముక్కుపచ్చలారని పసికందులను తమ తల్లిదండ్రుల నుంచి అపహరించి… ఇష్టారాజ్యాంగా అమ్ముతూ భారీగా సొమ్ము చేసుకున్నారు.
Read Also: Allu Arjun: బాలీవుడ్ మూవీకి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్.. పుష్క2 కంటే ముందే రిలీజ్
Also Read
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
కానీ వారి దందాకు పోలీసులు గండి కొట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఎన్నో నమ్మశక్యం కాని విషయాలు వెలుగులోకి వచ్చాయి. నవంబర్ 10న నాగ్ పూర్ లోని బాలాఘాట్లో ఎనిమిది నెలల పసికందును ఈ జంట కిడ్నాప్ చేసింది. తమ బిడ్డ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ తల్లిదండ్రులు. దీంతో ప్రజాపతి దంపతులను పోలీసులు ఐదుగంటల్లోనే పట్టుకున్నారు. పోలీసుల చెరనుంచి తప్పించుకుని తిరుగుతుండగా తాజాగా మరోసారి బాలాఘాట్లో పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సారి తమదైన శైలిలో విచారణ జరుపగా 51నెలల్లో 5గురు పిల్లలకు జన్మనివ్వగా.. వారిలో ముగ్గురిని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి అమ్మినట్లు తెలిపారు. అలా సుమారు ఐదేళ్లలో ఇతరుల 9మంది చిన్నారులను పలు రాష్ట్రాల్లో విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. పిల్లలను కొనుగోలు చేసిన వారికోసం పోలీసులు వెతుకుతున్నారు.
తాజావార్తలు
-
Mega 158 Update: ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ ‘స్వాగ్’తో బాస్ లుక్.. చూశారా?
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!