కొంపముంచిన ఫ్రెషర్స్ పార్టీ…182 మంది విద్యార్థులకు కరోనా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక మెడికల్ కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ కొంపముంచింది. కరోనా నిబంధనలు గాలికొదిలేసి ఫ్రెషర్స్ పార్టీ జరుపుకోవడంతో… వందలాది మంది విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. ధార్వాడ్ మెడికల్ కాలేజీలో కరోనా కేసుల సంఖ్య 182కు చేరింది. విద్యార్థులతోపాటు సిబ్బంది కూడా వైరస్ బారినపడ్డారు. దీంతో ధార్వాడ్ మెడికల్ కాలేజీ కోవిడ్ క్లస్టర్గా మారిపోయింది. బాధితుల్లో మెజార్టీ సంఖ్య టీకా రెండు డోసులు తీసుకొన్నవారే కావడం.. మరింత టెన్షన్ పుట్టిస్తోంది. ధార్వాడ్ జిల్లాలోని ఎస్డీఎమ్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మొదట 300 మందికి కరోనా పరీక్షలు చేయించారు. అందులో 66 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
తాజాగా మరికొందరి రిపోర్ట్ రావడంతో… మరో 116 మందికి పాజిటివ్గా తేలడంతో… భయం పట్టుకుంది. వీరంతా ఫ్రెషర్స్ పార్టీలో పాల్గొన్నవారే కావడంతో… ఆ సమయంలోనే వారికి వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. కాలేజీలో కరోనా కేసులు భారీగా పెరగడంపై ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి పెట్టారు. వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో.. ఏదైనా కొత్త వేరియంట్ కారణం కావచ్చని భావిస్తున్నారు. ఆ అనుమానంతో కరోనా బారినపడిన విద్యార్థులకు జన్యు పరీక్షలకు చేయిస్తామని తెలిపారు.
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
కాలేజీలో ఉన్న దాదాపు 3వేల మంది విద్యార్థులు, సిబ్బంది అందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకూ వెయ్యి మందికి పరీక్షలు చేయించగా… కొందరి ఫలితాలు రావాల్సి ఉంది. కాలేజీ అధికారులు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాలేజీలోని రెండు హాస్టళ్లను సీల్ చేసి, ఎవరినీ బయటకు వెళ్లకుండా చేశారు. అందరినీ క్వారెంటైన్లో ఉంచారు. బాధితుల్లో కొందరికి స్వల్ప లక్షణాలు ఉంటే… మరికొందరికి అసలు లక్షణాలు లేవని తెలిపారు. వారిని క్యాంపస్లో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. ప్రైమరీ, సెకెండరీ కాంటాక్టలను గుర్తించే పనిలో పడ్డారు. అయితే మరింత మంది కరోనా బారిన పడే ప్రమాదం ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి