కొంపముంచిన ఫ్రెషర్స్ పార్టీ…182 మంది విద్యార్థులకు కరోనా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక మెడికల్ కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ కొంపముంచింది. కరోనా నిబంధనలు గాలికొదిలేసి ఫ్రెషర్స్ పార్టీ జరుపుకోవడంతో… వందలాది మంది విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. ధార్వాడ్ మెడికల్ కాలేజీలో కరోనా కేసుల సంఖ్య 182కు చేరింది. విద్యార్థులతోపాటు సిబ్బంది కూడా వైరస్ బారినపడ్డారు. దీంతో ధార్వాడ్ మెడికల్ కాలేజీ కోవిడ్ క్లస్టర్గా మారిపోయింది. బాధితుల్లో మెజార్టీ సంఖ్య టీకా రెండు డోసులు తీసుకొన్నవారే కావడం.. మరింత టెన్షన్ పుట్టిస్తోంది. ధార్వాడ్ జిల్లాలోని ఎస్డీఎమ్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మొదట 300 మందికి కరోనా పరీక్షలు చేయించారు. అందులో 66 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
తాజాగా మరికొందరి రిపోర్ట్ రావడంతో… మరో 116 మందికి పాజిటివ్గా తేలడంతో… భయం పట్టుకుంది. వీరంతా ఫ్రెషర్స్ పార్టీలో పాల్గొన్నవారే కావడంతో… ఆ సమయంలోనే వారికి వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. కాలేజీలో కరోనా కేసులు భారీగా పెరగడంపై ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి పెట్టారు. వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో.. ఏదైనా కొత్త వేరియంట్ కారణం కావచ్చని భావిస్తున్నారు. ఆ అనుమానంతో కరోనా బారినపడిన విద్యార్థులకు జన్యు పరీక్షలకు చేయిస్తామని తెలిపారు.
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
కాలేజీలో ఉన్న దాదాపు 3వేల మంది విద్యార్థులు, సిబ్బంది అందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకూ వెయ్యి మందికి పరీక్షలు చేయించగా… కొందరి ఫలితాలు రావాల్సి ఉంది. కాలేజీ అధికారులు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాలేజీలోని రెండు హాస్టళ్లను సీల్ చేసి, ఎవరినీ బయటకు వెళ్లకుండా చేశారు. అందరినీ క్వారెంటైన్లో ఉంచారు. బాధితుల్లో కొందరికి స్వల్ప లక్షణాలు ఉంటే… మరికొందరికి అసలు లక్షణాలు లేవని తెలిపారు. వారిని క్యాంపస్లో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. ప్రైమరీ, సెకెండరీ కాంటాక్టలను గుర్తించే పనిలో పడ్డారు. అయితే మరింత మంది కరోనా బారిన పడే ప్రమాదం ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!