YCP vs TDP: బెజవాడలో ఎన్టీఆర్ ఫ్లెక్సీల వివాదం.. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి రాసివ్వలేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YCP vs TDP: బెజవాడలో ఫ్లెక్సీల రాజకీయం కాకరేపుతోంది.. ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది పరిస్థితి… పటమట సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వైసీపీ ఫ్లెక్సీల ఏర్పాటు చేయడంతో వివాదం మొదలైంది.. ఎన్టీఆర్, సీఎం జగన్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, దేవినేని అవినాష్ ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. ఎన్టీఆర్ కి శత జయంతి నీరాజనాలు అంటూ ఫ్లెక్సీలు పెట్టారు.. అయితే, అవినాష్ ఫ్లెక్సీల ఏర్పాటుపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.. ఫ్లెక్సీల ఏర్పాటు నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. భారీగా పోలీసులను మోహరించారు. ఇక, ఘటనపై స్పందించిన వైసీపీ తూర్పు ఇంఛార్జ్ దేవినేని అవినాష్.. టీడీపీపై సెటైర్లు వేశారు.
Read Also: Andhra Pradesh: బదిలీలకు అప్పటి వరకు దరఖాస్తు పెట్టుకోవాలి.. ఇవి కీలకం..
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్య దైవం .. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు రేపు ఘనంగా నిర్వహిస్తున్నాం అని తెలిపారు దేవినేని అవినాష్.. ఎన్టీఆర్ లలితకళా అవార్డును పోసానికి ఇస్తున్నాం.. టీడీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావన రాకుండా చేసేవారని మండిపడ్డారు.. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టి నేత వైఎస్ జగన్ అని గుర్తుచేశారు. ఇక, ఎన్టీఆర్ విగ్రహం దగ్గర వైసీపీ ఫ్లెక్సీలపై దేవినేని అవినాష్ స్పందిస్తూ.. మేం కూడా ఎన్టీఆర్ అభిమానులమే.. ఎన్టీఆర్ కు బ్యానర్లు కట్టే హక్కు మాకుందన్నారు.. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి రాసివ్వలేదు.. అది వాళ్ల పార్టీ ఆఫీసు కాదు అని ఎద్దేవా చేశారు. మేం బ్యానర్లు కట్టే వరకు అక్కడ ఎన్టీఆర్ కు బ్యానర్లు కట్టే వారే లేరన్నారు. వారి ప్రవర్తన చాలా బాధగా కలిగించింది.. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కవ్వింపు చర్యలు.. అల్లర్లను ప్రోత్సహించే విధానం మానుకోవాలని గద్దె రామ్మోహన్ను హెచ్చరించారు దేవినేని అవినాష్.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..