Facebook Friend: అమెరికా యువతితో ఫేస్బుక్లో పరిచయం.. ఇండియాకు రప్పించి అత్యాచారం
- రాజస్థాన్లోని అజ్మీర్లో అమెరికా మహిళపై అత్యాచారం
- పెళ్లయిన ఓ లాయర్ అమెరికాకు చెందిన అమ్మాయితో ఫేస్బుక్లో స్నేహం
- తనకు పెళ్లికాలేదని యువతిని భారత్కు రప్పించిన వ్యక్తి
- జైపూర్.. అజ్మీర్ సహా పలు చోట్ల హోటళ్లలో యువతికి సౌకర్యం
- ఈ క్రమంలో అమెరికా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు.
రాజస్థాన్లోని అజ్మీర్లో అమెరికా మహిళపై అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగు చూసింది. పెళ్లయిన ఓ లాయర్ అమెరికాకు చెందిన అమ్మాయితో ఫేస్బుక్లో స్నేహం చేశాడు. తనకు పెళ్లికాలేదని యువతిని భారత్కు రప్పించాడు. జైపూర్, అజ్మీర్ సహా పలు చోట్ల హోటళ్లలో యువతికి సౌకర్యం కల్పించాడు. ఈ క్రమంలో అమెరికా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. దానికి ఆ వ్యక్తి అబద్ధపు మాటలు చెబుతూ వచ్చాడని యువతి తెలిపింది. ఈ క్రమంలో.. నిందితుడు మోసం చేశాడని తెలిసుకుని బాధిత మహిళ బుండిలోని ఎన్జీవోను సంప్రదించి.. బుండి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై అజ్మీర్ పోలీసులు చర్యలు చేపట్టారు.
Xiaomi Redmi K70 Ultra: అదిరిపోయే ఫీచర్లతో కొత్త మొబైల్ను తీసుకొచ్చిన షియోమీ..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
విదేశీ మహిళపై అత్యాచారం వార్త కలకలం సృష్టించింది. దీంతో.. పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు చేశారు. బుండి సిటీ సీఓ అమర్ సింగ్, సదర్ ఇంచార్జి భగవాన్ సహాయ్ మీనా వెంటనే మహిళా పోలీస్ స్టేషన్కు చేరుకుని విషయం తెలుసుకున్నారు. మహిళా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అష్మీన్ బానో మాట్లాడుతూ.. బాధితురాలు బుండి ఎన్జిఓ ద్వారా పోలీస్ స్టేషన్కు వచ్చిందని, అక్కడ తనకు జరిగిన సంఘటన గురించి ఆమె సమాచారం ఇచ్చిందని చెప్పారు. వెంటనే విచారణ సందర్భంగా లిఖిత పూర్వకంగా నివేదిక తీసుకుని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ హనుమాన్ మీనాకు పూర్తి సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, అర్థరాత్రి బూండీ ఆస్పత్రిలో విదేశీ మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
Google Maps: గూగుల్ మాప్స్ లో కొత్త ఫీచర్స్…ఇక నుంచి ఫ్లైఓవర్ అలర్ట్
తనకు పెళ్లికాలేదని నిందితుడు ఫేస్బుక్ ద్వారా తనతో స్నేహం చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాల్లో పేర్కొంది. కాగా.. మోసం చేసిన వ్యక్తి మానవ్ రాథోడ్ అజ్మీర్ నివాసిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడికి ఇప్పటికే పెళ్లి అయిందని, అయితే ఫేస్బుక్ ద్వారా అమెరికా యువతితో స్నేహం ఏర్పడిందని చెప్పారు. దీంతో.. బాధితురాలు ఇటీవల భారత్కు వచ్చిందన్నారు. ఒకరోజు నిందితుడుని బాధితురాలు కలిసిన తర్వాత.. తనకు పెళ్లై పిల్లాడు కూడా ఉన్నట్లు బాధిత మహిళ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మోసపోయానని ఆ మహిళ ఎన్జీవో సాయం కోరిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత.. మహిళా పోలీస్ స్టేషన్లో నిందితుడిపై యువతి కంప్లైంట్ చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో