Facebook Friend: అమెరికా యువతితో ఫేస్బుక్లో పరిచయం.. ఇండియాకు రప్పించి అత్యాచారం
- రాజస్థాన్లోని అజ్మీర్లో అమెరికా మహిళపై అత్యాచారం
- పెళ్లయిన ఓ లాయర్ అమెరికాకు చెందిన అమ్మాయితో ఫేస్బుక్లో స్నేహం
- తనకు పెళ్లికాలేదని యువతిని భారత్కు రప్పించిన వ్యక్తి
- జైపూర్.. అజ్మీర్ సహా పలు చోట్ల హోటళ్లలో యువతికి సౌకర్యం
- ఈ క్రమంలో అమెరికా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని అజ్మీర్లో అమెరికా మహిళపై అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగు చూసింది. పెళ్లయిన ఓ లాయర్ అమెరికాకు చెందిన అమ్మాయితో ఫేస్బుక్లో స్నేహం చేశాడు. తనకు పెళ్లికాలేదని యువతిని భారత్కు రప్పించాడు. జైపూర్, అజ్మీర్ సహా పలు చోట్ల హోటళ్లలో యువతికి సౌకర్యం కల్పించాడు. ఈ క్రమంలో అమెరికా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. దానికి ఆ వ్యక్తి అబద్ధపు మాటలు చెబుతూ వచ్చాడని యువతి తెలిపింది. ఈ క్రమంలో.. నిందితుడు మోసం చేశాడని తెలిసుకుని బాధిత మహిళ బుండిలోని ఎన్జీవోను సంప్రదించి.. బుండి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై అజ్మీర్ పోలీసులు చర్యలు చేపట్టారు.
Xiaomi Redmi K70 Ultra: అదిరిపోయే ఫీచర్లతో కొత్త మొబైల్ను తీసుకొచ్చిన షియోమీ..
Also Read
- DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
విదేశీ మహిళపై అత్యాచారం వార్త కలకలం సృష్టించింది. దీంతో.. పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు చేశారు. బుండి సిటీ సీఓ అమర్ సింగ్, సదర్ ఇంచార్జి భగవాన్ సహాయ్ మీనా వెంటనే మహిళా పోలీస్ స్టేషన్కు చేరుకుని విషయం తెలుసుకున్నారు. మహిళా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అష్మీన్ బానో మాట్లాడుతూ.. బాధితురాలు బుండి ఎన్జిఓ ద్వారా పోలీస్ స్టేషన్కు వచ్చిందని, అక్కడ తనకు జరిగిన సంఘటన గురించి ఆమె సమాచారం ఇచ్చిందని చెప్పారు. వెంటనే విచారణ సందర్భంగా లిఖిత పూర్వకంగా నివేదిక తీసుకుని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ హనుమాన్ మీనాకు పూర్తి సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, అర్థరాత్రి బూండీ ఆస్పత్రిలో విదేశీ మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
Google Maps: గూగుల్ మాప్స్ లో కొత్త ఫీచర్స్…ఇక నుంచి ఫ్లైఓవర్ అలర్ట్
తనకు పెళ్లికాలేదని నిందితుడు ఫేస్బుక్ ద్వారా తనతో స్నేహం చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాల్లో పేర్కొంది. కాగా.. మోసం చేసిన వ్యక్తి మానవ్ రాథోడ్ అజ్మీర్ నివాసిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడికి ఇప్పటికే పెళ్లి అయిందని, అయితే ఫేస్బుక్ ద్వారా అమెరికా యువతితో స్నేహం ఏర్పడిందని చెప్పారు. దీంతో.. బాధితురాలు ఇటీవల భారత్కు వచ్చిందన్నారు. ఒకరోజు నిందితుడుని బాధితురాలు కలిసిన తర్వాత.. తనకు పెళ్లై పిల్లాడు కూడా ఉన్నట్లు బాధిత మహిళ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మోసపోయానని ఆ మహిళ ఎన్జీవో సాయం కోరిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత.. మహిళా పోలీస్ స్టేషన్లో నిందితుడిపై యువతి కంప్లైంట్ చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
-
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
-
CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
-
Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..