Facebook Friend: అమెరికా యువతితో ఫేస్బుక్లో పరిచయం.. ఇండియాకు రప్పించి అత్యాచారం
- రాజస్థాన్లోని అజ్మీర్లో అమెరికా మహిళపై అత్యాచారం
- పెళ్లయిన ఓ లాయర్ అమెరికాకు చెందిన అమ్మాయితో ఫేస్బుక్లో స్నేహం
- తనకు పెళ్లికాలేదని యువతిని భారత్కు రప్పించిన వ్యక్తి
- జైపూర్.. అజ్మీర్ సహా పలు చోట్ల హోటళ్లలో యువతికి సౌకర్యం
- ఈ క్రమంలో అమెరికా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని అజ్మీర్లో అమెరికా మహిళపై అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగు చూసింది. పెళ్లయిన ఓ లాయర్ అమెరికాకు చెందిన అమ్మాయితో ఫేస్బుక్లో స్నేహం చేశాడు. తనకు పెళ్లికాలేదని యువతిని భారత్కు రప్పించాడు. జైపూర్, అజ్మీర్ సహా పలు చోట్ల హోటళ్లలో యువతికి సౌకర్యం కల్పించాడు. ఈ క్రమంలో అమెరికా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. దానికి ఆ వ్యక్తి అబద్ధపు మాటలు చెబుతూ వచ్చాడని యువతి తెలిపింది. ఈ క్రమంలో.. నిందితుడు మోసం చేశాడని తెలిసుకుని బాధిత మహిళ బుండిలోని ఎన్జీవోను సంప్రదించి.. బుండి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై అజ్మీర్ పోలీసులు చర్యలు చేపట్టారు.
Xiaomi Redmi K70 Ultra: అదిరిపోయే ఫీచర్లతో కొత్త మొబైల్ను తీసుకొచ్చిన షియోమీ..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
విదేశీ మహిళపై అత్యాచారం వార్త కలకలం సృష్టించింది. దీంతో.. పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు చేశారు. బుండి సిటీ సీఓ అమర్ సింగ్, సదర్ ఇంచార్జి భగవాన్ సహాయ్ మీనా వెంటనే మహిళా పోలీస్ స్టేషన్కు చేరుకుని విషయం తెలుసుకున్నారు. మహిళా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అష్మీన్ బానో మాట్లాడుతూ.. బాధితురాలు బుండి ఎన్జిఓ ద్వారా పోలీస్ స్టేషన్కు వచ్చిందని, అక్కడ తనకు జరిగిన సంఘటన గురించి ఆమె సమాచారం ఇచ్చిందని చెప్పారు. వెంటనే విచారణ సందర్భంగా లిఖిత పూర్వకంగా నివేదిక తీసుకుని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ హనుమాన్ మీనాకు పూర్తి సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, అర్థరాత్రి బూండీ ఆస్పత్రిలో విదేశీ మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
Google Maps: గూగుల్ మాప్స్ లో కొత్త ఫీచర్స్…ఇక నుంచి ఫ్లైఓవర్ అలర్ట్
తనకు పెళ్లికాలేదని నిందితుడు ఫేస్బుక్ ద్వారా తనతో స్నేహం చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాల్లో పేర్కొంది. కాగా.. మోసం చేసిన వ్యక్తి మానవ్ రాథోడ్ అజ్మీర్ నివాసిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడికి ఇప్పటికే పెళ్లి అయిందని, అయితే ఫేస్బుక్ ద్వారా అమెరికా యువతితో స్నేహం ఏర్పడిందని చెప్పారు. దీంతో.. బాధితురాలు ఇటీవల భారత్కు వచ్చిందన్నారు. ఒకరోజు నిందితుడుని బాధితురాలు కలిసిన తర్వాత.. తనకు పెళ్లై పిల్లాడు కూడా ఉన్నట్లు బాధిత మహిళ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మోసపోయానని ఆ మహిళ ఎన్జీవో సాయం కోరిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత.. మహిళా పోలీస్ స్టేషన్లో నిందితుడిపై యువతి కంప్లైంట్ చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!