Bhadradri Kothagudem: బీఆర్ఎస్ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కాంగ్రెస్ నేతలు.. కుర్చీలు, సామగ్రి దగ్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంలో ఫర్నిచర్ని కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. కార్యాలయంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు చొరబడి అందులో వస్తువులను ధ్వంసం చేశారు. కుర్చీలు, జండాలు బయటికి తీసుకొచ్చి కాల్చేశారు. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భవనమని చెబుతున్నారు. మాజీ విప్ రేగా కాంతారావు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ మారిన ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చివేశారని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. నాడు అధికారం అండతో రేగా కాంతారావు చేసిన చర్యను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోలేకపోయారు.
Also Read
అప్పటి నుంచి ఆ కార్యాలయం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ కార్యాలయం కోసం కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త స్థలాన్ని డొనేట్ చేశారు. ఆ స్థలంలో కార్యాలయ నిర్మాణం చేపట్టారు. ఇది తానే నిర్మించానని.. తనకే చెందుతుందని బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చేశారు రేగా కాంతారావు. అయితే మొన్నటి ఎన్నికల్లో రేగా కాంతారావు ఓడిపోయిన తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో ఉత్తేజం వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఈ కార్యాలయంలోకి చొరబడి.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సామాగ్రి, కుర్చీలు బయటకు తెచ్చి పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
READ MORE: Raj Thackeray: ప్రతిపక్ష కూటమితో చేరిన రాజ్ ఠాక్రే..
తాజావార్తలు
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. ‘వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు’!
-
HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
-
HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
-
Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!
-
Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!