Congress: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే లోక్సభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే గ్యారంటీల పేరుతో కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. దీంతో ఇదే పద్ధతిని దేశ వ్యాప్తంగా మేనిఫెస్టోలో చేర్చి అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం భారీ పథకాలతోనే మేనిఫెస్టో తయారు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మేనిఫెస్టో విడుదలకు కాంగ్రెస్ ముహూర్తం ఖరారు చేసింది.
ఏప్రిల్ 6న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. జైపుర్లో జరిగే బహిరంగ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విడుదల చేస్తారని రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సుఖ్జిందర్ సింగ్ రంధ్వా వెల్లడించారు. ఢిల్లీలో పార్టీ వార్ రూమ్ భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు.
Also Read
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు, 25 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించనుంది. ‘న్యాయ్ పిల్లర్ల’ పేరుతో 25 గ్యారంటీలను ఐదు భాగాలుగా విభజించింది. ‘పీపుల్స్ మేనిఫెస్టో’ పేరుతో దీని రూపకల్పన కోసం కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఆధ్వర్యంలోని పార్టీ కమిటీ ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది.
నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదల ఆదాయానికి భరోసా, మహిళల హక్కులు, రైతులను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు పార్టీ సీనియర్ నేత శశిథరూర్ తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పంటకు కనీస మద్దత ధర చట్టం చేస్తామని ప్రకటించింది. మేనిఫెస్టోలో దీనిపై మరింత స్పష్టత ఇవ్వనున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిరుద్యోగులు, మహిళలు, కార్మికులు, రైతులకు హామీలు ఇచ్చింది. మహిళలకు ‘నారీ న్యాయ్’, రైతులకు ‘కిసాన్ న్యాయ్’పేరిట ఐదు గ్యారంటీలను ప్రకటించింది. నిరుద్యోగులకు ఉపాధి హక్కుతో పాటు, పరీక్ష పత్రాల లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టం అంశాలను మేనిఫెస్టోలో చేర్చినట్లు సమాచారం.
- Tags
తాజావార్తలు
-
NP50 : నివిన్ పౌలి 50 ‘విజయం’.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
-
ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
-
Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
-
Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
-
Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..