తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడీగా కొనసాగుతున్నాయి. విద్యుత్ అప్పులపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్, ఎంఐంఎం మధ్య రచ్చ జరుగుతోంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మొదటిసారి వచ్చిన సభ్యుడు పొరపాటుగా మాట్లాడితే.. అలా కాదు అని చెప్పాలి.. కానీ అక్బరుద్దీన్.. అకల్ ఉందా అని మాట్లాడటం సరికాదని భట్టి విక్రమార్క తెలిపారు. భాష, విషయం ఉందని సభానాయకుడిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని అన్నారు.
Nadendla Manohar: 10.64 లక్షల పెన్షన్లు దారి మళ్లింపు..! జనసేన తీవ్ర ఆరోపణలు
అనంతరం.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. బీజేపీకి మేము బీ టీం కాదన్నారు. చనిపోయినా కూడా బాబ్రీ మజీద్ కూల్చిన బీజేపీతో కలిసి పోమన్నారు. అనంతరం.. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్, 700 పోల్స్ గురించి మాట్లాడుతున్నారు.. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మీలాగే అందరూ గెలిచి వచ్చారు.. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎదురు దాడి చేస్తే ఎలా అని దుయ్యబట్టారు.
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కి బెయిల్ ఇవ్వొద్దు.. డీసీపీ వచ్చి బ్రతిమలాడినా వినలేదు!
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ సబ్జెక్ట్ మాట్లాడు.. సభను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. రికార్డు నుండి అక్బరుద్దీన్ వ్యాఖ్యలు తొలగించండని అన్నారు. అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఎంఐఎం రాజశేఖర్ రెడ్డి కలిసి 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు.. వైఎస్ఆర్ జెంటిల్ మెన్ అని అన్నారు. అప్పుడు సీఎం.. ఆ పార్టీలో లేరని తెలిపారు. షబ్బీర్ అలీ మేము వైఎస్ కలిసి 4 శాతం రిజర్వేషన్ కోసం కష్టపడ్డామని అక్బరుద్దీన్ చెప్పారు.