Congress: మరో జాబితా విడుదల.. వరంగల్ సీటు ఎవరికి దక్కిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను వెల్లడించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను వెల్లడించింది.
ఇది కూడా చదవండి: CM Jagan Bus Yatra: రేపు ఆరో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్..
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
మహారాష్ట్రలోని అకోలా నుంచి అభయ్ కాశీనాథ్ పాటిల్, వరంగల్ నుంచి కడియం కావ్య పోటీ చేయనున్నారు. ఈ మేరకు అభ్యర్థుల లిస్టును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఇదిలా ఉంటే కడియం కావ్య కొన్ని గంటల ముందే కాంగ్రెస్లో చేరారు. తొలుత ఆమెకు బీఆర్ఎస్ నుంచి వరంగల్ సీటు లభించింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ ప్రతిష్టత దెబ్బతింది అంటూ పార్టీకి లెటర్ రాసి పోటీ నుంచి తప్పుకున్నారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్ నేతలతో తన తండ్రి కడియం శ్రీహరితో పాటు కలిశారు. కాంగ్రెస్లో చేరిన కొన్ని గంటల్లోనే ఆమెకు తిరిగి కాంగ్రెస్ నుంచి వరంగల్ లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇక హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Toll fee: వాహనదారులకు శుభవార్త.. టోల్ ఛార్జీలపై ఈసీ ఆదేశాలివే!
ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. అభ్యర్థులు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ దాదాపుగా పోటీ చేస్తు్న్న స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. మరికొన్ని స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు మేనిఫెస్టోపై కూడా ఫోకస్ పెట్టాయి. త్వరలోనే విడుదల చేయనున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్లో ఇటీవల చేరిన బీఆర్ఎస్ నేతలకు సీట్లు లభించడం విశేసం. చేవళ్లలో రజింత్రెడ్డికి, సికింద్రాబాద్లో దానం నాగేందర్కు, వరంగల్లో కడియం కావ్యకు సీట్లు లభించాయి. ఇటీవలే వీరంతా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వచ్చారు. అలా వచ్చారో.. లేదో.. ఇలా సీట్లు లభించాయి.
ఇది కూడా చదవండి: Rohit Sharma: ‘హిట్ మ్యాన్’ ఖాతాలో చెత్త రికార్డు..
దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25 మరియు జూన్ 1న తదుపరి ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో ఈనెల 5న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!