Congress: మరో జాబితా విడుదల.. వరంగల్ సీటు ఎవరికి దక్కిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను వెల్లడించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను వెల్లడించింది.
ఇది కూడా చదవండి: CM Jagan Bus Yatra: రేపు ఆరో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్..
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
మహారాష్ట్రలోని అకోలా నుంచి అభయ్ కాశీనాథ్ పాటిల్, వరంగల్ నుంచి కడియం కావ్య పోటీ చేయనున్నారు. ఈ మేరకు అభ్యర్థుల లిస్టును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఇదిలా ఉంటే కడియం కావ్య కొన్ని గంటల ముందే కాంగ్రెస్లో చేరారు. తొలుత ఆమెకు బీఆర్ఎస్ నుంచి వరంగల్ సీటు లభించింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ ప్రతిష్టత దెబ్బతింది అంటూ పార్టీకి లెటర్ రాసి పోటీ నుంచి తప్పుకున్నారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్ నేతలతో తన తండ్రి కడియం శ్రీహరితో పాటు కలిశారు. కాంగ్రెస్లో చేరిన కొన్ని గంటల్లోనే ఆమెకు తిరిగి కాంగ్రెస్ నుంచి వరంగల్ లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇక హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Toll fee: వాహనదారులకు శుభవార్త.. టోల్ ఛార్జీలపై ఈసీ ఆదేశాలివే!
ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. అభ్యర్థులు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ దాదాపుగా పోటీ చేస్తు్న్న స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. మరికొన్ని స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు మేనిఫెస్టోపై కూడా ఫోకస్ పెట్టాయి. త్వరలోనే విడుదల చేయనున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్లో ఇటీవల చేరిన బీఆర్ఎస్ నేతలకు సీట్లు లభించడం విశేసం. చేవళ్లలో రజింత్రెడ్డికి, సికింద్రాబాద్లో దానం నాగేందర్కు, వరంగల్లో కడియం కావ్యకు సీట్లు లభించాయి. ఇటీవలే వీరంతా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వచ్చారు. అలా వచ్చారో.. లేదో.. ఇలా సీట్లు లభించాయి.
ఇది కూడా చదవండి: Rohit Sharma: ‘హిట్ మ్యాన్’ ఖాతాలో చెత్త రికార్డు..
దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25 మరియు జూన్ 1న తదుపరి ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో ఈనెల 5న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తాజావార్తలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
-
Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
-
Summer Special: మామిడితో ఈ మ్యాజిక్ ట్రై చేశారా..? ఒక్క స్పూన్ తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు!
-
West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!