Pm Modi: దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటంలో కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్పై కాంగ్రెస్ ప్రేమ గరిష్ట స్థాయికి చేరుతోందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అన్నారు. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. పాకిస్థాన్పై కాంగ్రెస్కు ప్రేమ ఉందని పునరుద్ఘాటించారు. మన సైన్యంపై ఉగ్రదాడులు దాడి చేస్తుంటే, పాకిస్థాన్ నిర్దోషి అని కాంగ్రెస్ కు చెందిన ఓ మాజీ సీఎం అన్నట్లు పేర్కొన్నారు. ముంబయి ఉగ్రదాడిలో కూడా పాకిస్థాన్ హస్తం లేదని మరో కాంగ్రెస్ నేత చెప్పారని గుర్తు చేశారు.
దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటంలో కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వారసత్వాన్ని కాపాడుకోవడానికే.. ఇండియా కూటమి పోటీ చేస్తుందని దుయ్యబట్టారు. ఈ పార్టీలు దేశ ప్రజల విశ్వాసాలను గాని.. దేశ ప్రయోజనాలను గాని పట్టించుకోరన్నారు. ముస్లిం సంపాదనపైన, వారి రిజర్వేషన్లపైన కాంగ్రెస్ దృష్టి ఉందన్నారు. ఏదో ఒక సాకుతో వారి ఆస్తులను దోచుకోవడమే కాకుండా రిజర్వేషన్లను కూడా దోచుకోవాలని చూస్తున్నారన్నారు.
READ MORE: Online Gaming Fraud: ఆన్లైన్ గేమ్స్ లో రూ.12 లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరకు ఆత్మహత్య..
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
సభలో మోడీ మాట్లాడుతూ.. “మీ ఒక్క ఓటు భారతదేశాన్ని 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చింది. మీ ఒక్క ఓటు ప్రపంచంలో భారతదేశ ఆధిపత్యాన్ని పెంచింది. మీ ఒక్క ఓటు 70 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని తొలగించెలా చేసింది. మీ ఒక్క ఓటు గిరిజన కుమార్తెను రాష్ట్రపతిని చేసింది. మీ ఒక్క ఓటు మహిళలకు రిజర్వేషన్ హక్కు కల్పించింది. మీ ఒక్క ఓటు అవినీతిపరులను జైలుకు పంపింది. మీ ఒక్క ఓటు ఉచిత రేషన్, ఉచిత చికిత్సకు హామీ ఇస్తుంది. మీ ఒక్క ఓటు యువత భవిష్యత్తును తీర్చిదిద్దింది. అపారమైన అవకాశాలను సృష్టించింది. మీ ఒక్క ఓటు 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకి తీసుకొచ్చింది. మీ ఒక్క ఓటుకు ఉన్న శక్తిని చూడండి, మీ ఒక్క ఓటు 500 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికి రాముడి యొక్క గొప్ప ఆలయాన్ని నిర్మించింది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే ఇంకా చాలా చేయాల్సి ఉందని పేర్కొన్నారు.”
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!