Pm Modi: దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటంలో కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్పై కాంగ్రెస్ ప్రేమ గరిష్ట స్థాయికి చేరుతోందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అన్నారు. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. పాకిస్థాన్పై కాంగ్రెస్కు ప్రేమ ఉందని పునరుద్ఘాటించారు. మన సైన్యంపై ఉగ్రదాడులు దాడి చేస్తుంటే, పాకిస్థాన్ నిర్దోషి అని కాంగ్రెస్ కు చెందిన ఓ మాజీ సీఎం అన్నట్లు పేర్కొన్నారు. ముంబయి ఉగ్రదాడిలో కూడా పాకిస్థాన్ హస్తం లేదని మరో కాంగ్రెస్ నేత చెప్పారని గుర్తు చేశారు.
దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటంలో కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వారసత్వాన్ని కాపాడుకోవడానికే.. ఇండియా కూటమి పోటీ చేస్తుందని దుయ్యబట్టారు. ఈ పార్టీలు దేశ ప్రజల విశ్వాసాలను గాని.. దేశ ప్రయోజనాలను గాని పట్టించుకోరన్నారు. ముస్లిం సంపాదనపైన, వారి రిజర్వేషన్లపైన కాంగ్రెస్ దృష్టి ఉందన్నారు. ఏదో ఒక సాకుతో వారి ఆస్తులను దోచుకోవడమే కాకుండా రిజర్వేషన్లను కూడా దోచుకోవాలని చూస్తున్నారన్నారు.
READ MORE: Online Gaming Fraud: ఆన్లైన్ గేమ్స్ లో రూ.12 లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరకు ఆత్మహత్య..
Also Read
- Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే 'ఫ్లఫీ ఆమ్లెట్' చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
- Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
- Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
సభలో మోడీ మాట్లాడుతూ.. “మీ ఒక్క ఓటు భారతదేశాన్ని 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చింది. మీ ఒక్క ఓటు ప్రపంచంలో భారతదేశ ఆధిపత్యాన్ని పెంచింది. మీ ఒక్క ఓటు 70 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని తొలగించెలా చేసింది. మీ ఒక్క ఓటు గిరిజన కుమార్తెను రాష్ట్రపతిని చేసింది. మీ ఒక్క ఓటు మహిళలకు రిజర్వేషన్ హక్కు కల్పించింది. మీ ఒక్క ఓటు అవినీతిపరులను జైలుకు పంపింది. మీ ఒక్క ఓటు ఉచిత రేషన్, ఉచిత చికిత్సకు హామీ ఇస్తుంది. మీ ఒక్క ఓటు యువత భవిష్యత్తును తీర్చిదిద్దింది. అపారమైన అవకాశాలను సృష్టించింది. మీ ఒక్క ఓటు 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకి తీసుకొచ్చింది. మీ ఒక్క ఓటుకు ఉన్న శక్తిని చూడండి, మీ ఒక్క ఓటు 500 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికి రాముడి యొక్క గొప్ప ఆలయాన్ని నిర్మించింది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే ఇంకా చాలా చేయాల్సి ఉందని పేర్కొన్నారు.”
తాజావార్తలు
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!