Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొనాలంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఆహ్వానం
Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొనాలంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీకి ఆహ్వానం అందింది. బీజేపీ నేతకు ఆహ్వానం అందడం ఏమిటని అనుకుంటున్నారా.. ఆహ్వానం అందడం నిజమేనండోయ్. ఉత్తరప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేత దీపక్ సింగ్ కేంద్ర మంత్రిని జోడో యాత్రలో పాల్గొనాలంటూ ఆహ్వానించారు. ఈమేరకు గౌరిగంజ్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో స్మృతి ఇరానీ కార్యదర్శి నరేశ్ శర్మకు లేఖ అందించారు. అమేథీ బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీకి లేఖ రాశానని, రాష్ట్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో చేరాల్సిందిగా ఆమెను ఆహ్వానిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ గురువారం తెలిపారు. బుధవారం గౌరీగంజ్లోని ఆమె క్యాంపు కార్యాలయంలో ఇరానీ కార్యదర్శి నరేష్ శర్మకు ఆహ్వానాన్ని అందజేసినట్లు సింగ్ తెలిపారు.
President Droupadi Murmu: యాదాద్రీశుడిని సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Also Read
- Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
- Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
- Ramchander Rao: "కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు".. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సిందిగా అందరినీ ఆహ్వానించాల్సిందిగా తమ పార్టీ సీనియర్ నేతలు తనకు సూచించారని మాజీ శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) తెలిపారు. అందరికంటే ముందుగా అమేథీ ఎంపీ స్మృతి జుబిన్ ఇరానీకి ఆహ్వాన పత్రం ఇవ్వాలని తాను అనుకున్నానని వెల్లడించారు. ఆహ్వానం గురించి అడగ్గా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దుర్గేష్ త్రిపాఠి, అమేథీ ఎంపీ లేదా పార్టీకి చెందిన ఇతర కార్యకర్త యాత్రలో చేరే ప్రశ్నే లేదని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నుంచి స్మృతి ఇరానీ ఎంపీగా గెలిచారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రాహుల్ గాంధీని ఆమె ఓడించారు. జనవరి 3న ఘజియాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్లోకి యాత్ర ప్రవేశిస్తుంది.
తాజావార్తలు
-
Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..
-
Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
-
Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
-
Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!