Ram Mandir : రాముడి విగ్రహంపై అభ్యంతరం వ్యక్తం చేసిన దిగ్విజయ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir : ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రామమందిరం ప్రాణ ప్రతిష్ఠపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు మరోసారి రాములోరి విగ్రహంపై కూడా ప్రశ్నలు సంధించారు. గర్భగుడిలో ఏర్పాటు చేసిన విగ్రహానికి సంబంధించి.. అది పాత విగ్రహమని మరోసారి ప్రశ్నించారు. తన అభిప్రాయాన్ని బలపరచడానికి.. అతను జోషిమఠ్లోని శంకరాచార్య స్వామి స్వరూపానంద్ జీ మహారాజ్ సహాయం కూడా తీసుకున్నాడు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా.. రెండవ విగ్రహం అవసరం ఏమిటి? ద్వారకా, జోషిమఠానికి చెందిన మా గురువు దివంగత శంకరాచార్య స్వామి స్వరూపానంద్ జీ మహారాజ్ కూడా రామజన్మభూమి ఆలయంలో రాముడి విగ్రహం బాల రాముడి రూపంలో ఉండాలని.. తల్లి కౌసల్య ఒడిలో ఉండాలని సూచించారు. కానీ ప్రతిష్ఠాపన చేస్తున్న విగ్రహం మాత్రం చిన్నపిల్లాడిలా కనిపించడం లేదన్నారు.
Read Also:Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు..
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై నిర్వాణి అఖారాకు చెందిన మహంత్ ధర్మదాస్ అభ్యంతరం వ్యక్తం చేసిన పోస్ట్తో పాటు దిగ్విజయ్ ఒక వార్తా వీడియోను కూడా పంచుకున్నారు. కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చిందో వారిని మాత్రమే గర్భగుడిలో ప్రతిష్ఠించాలని ధర్మదాస్ అన్నారు. అయోధ్య వివాదంలో పక్షపాతిగా ఉన్న ధర్మదాస్ పాత విగ్రహానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. పాత విగ్రహం స్థానంలో మరో విగ్రహాన్ని ఎవరూ ఏర్పాటు చేయకూడాదని అన్నారు. రామనగరి అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో ఉన్న గ్రాండ్ రామ్ టెంపుల్ గర్భగుడిలో గురువారం రామలాలా విగ్రహాన్ని దాని పీఠంపై ప్రతిష్ఠించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ గర్భగుడిలో రాంలాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 అంగుళాల విగ్రహం నలుపు రంగులో ఉండి రెండు టన్నుల బరువు ఉంటుంది. ప్రస్తుతం విగ్రహాన్ని పసుపు గుడ్డతో కప్పి ఉంచారు.
Read Also:WTC Table 2025: డబ్ల్యూటీసీలో అగ్రస్థానానికి ఆస్ట్రేలియా.. భారత్కు ఇంగ్లండ్ సిరీస్ కీలకం!
తాజావార్తలు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!