Ram Mandir : రాముడి విగ్రహంపై అభ్యంతరం వ్యక్తం చేసిన దిగ్విజయ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir : ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రామమందిరం ప్రాణ ప్రతిష్ఠపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు మరోసారి రాములోరి విగ్రహంపై కూడా ప్రశ్నలు సంధించారు. గర్భగుడిలో ఏర్పాటు చేసిన విగ్రహానికి సంబంధించి.. అది పాత విగ్రహమని మరోసారి ప్రశ్నించారు. తన అభిప్రాయాన్ని బలపరచడానికి.. అతను జోషిమఠ్లోని శంకరాచార్య స్వామి స్వరూపానంద్ జీ మహారాజ్ సహాయం కూడా తీసుకున్నాడు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా.. రెండవ విగ్రహం అవసరం ఏమిటి? ద్వారకా, జోషిమఠానికి చెందిన మా గురువు దివంగత శంకరాచార్య స్వామి స్వరూపానంద్ జీ మహారాజ్ కూడా రామజన్మభూమి ఆలయంలో రాముడి విగ్రహం బాల రాముడి రూపంలో ఉండాలని.. తల్లి కౌసల్య ఒడిలో ఉండాలని సూచించారు. కానీ ప్రతిష్ఠాపన చేస్తున్న విగ్రహం మాత్రం చిన్నపిల్లాడిలా కనిపించడం లేదన్నారు.
Read Also:Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు..
Also Read
- Telangana Exhibitors : ఆ 'జీవో 77' రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ
- US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
- Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్పై అమెరికా ఆఫర్ ఇదేనా?
- Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై నిర్వాణి అఖారాకు చెందిన మహంత్ ధర్మదాస్ అభ్యంతరం వ్యక్తం చేసిన పోస్ట్తో పాటు దిగ్విజయ్ ఒక వార్తా వీడియోను కూడా పంచుకున్నారు. కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చిందో వారిని మాత్రమే గర్భగుడిలో ప్రతిష్ఠించాలని ధర్మదాస్ అన్నారు. అయోధ్య వివాదంలో పక్షపాతిగా ఉన్న ధర్మదాస్ పాత విగ్రహానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. పాత విగ్రహం స్థానంలో మరో విగ్రహాన్ని ఎవరూ ఏర్పాటు చేయకూడాదని అన్నారు. రామనగరి అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో ఉన్న గ్రాండ్ రామ్ టెంపుల్ గర్భగుడిలో గురువారం రామలాలా విగ్రహాన్ని దాని పీఠంపై ప్రతిష్ఠించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ గర్భగుడిలో రాంలాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 అంగుళాల విగ్రహం నలుపు రంగులో ఉండి రెండు టన్నుల బరువు ఉంటుంది. ప్రస్తుతం విగ్రహాన్ని పసుపు గుడ్డతో కప్పి ఉంచారు.
Read Also:WTC Table 2025: డబ్ల్యూటీసీలో అగ్రస్థానానికి ఆస్ట్రేలియా.. భారత్కు ఇంగ్లండ్ సిరీస్ కీలకం!
తాజావార్తలు
-
CM Security : సీఎం లిఫ్ట్ సడన్ స్టాప్.. భద్రతపై అధికారుల ఫైర్..
-
Telangana Exhibitors : ఆ ‘జీవో 77’ రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ
-
US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్పై అమెరికా ఆఫర్ ఇదేనా?
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!