Ram Mandir : రాముడి విగ్రహంపై అభ్యంతరం వ్యక్తం చేసిన దిగ్విజయ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir : ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రామమందిరం ప్రాణ ప్రతిష్ఠపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు మరోసారి రాములోరి విగ్రహంపై కూడా ప్రశ్నలు సంధించారు. గర్భగుడిలో ఏర్పాటు చేసిన విగ్రహానికి సంబంధించి.. అది పాత విగ్రహమని మరోసారి ప్రశ్నించారు. తన అభిప్రాయాన్ని బలపరచడానికి.. అతను జోషిమఠ్లోని శంకరాచార్య స్వామి స్వరూపానంద్ జీ మహారాజ్ సహాయం కూడా తీసుకున్నాడు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా.. రెండవ విగ్రహం అవసరం ఏమిటి? ద్వారకా, జోషిమఠానికి చెందిన మా గురువు దివంగత శంకరాచార్య స్వామి స్వరూపానంద్ జీ మహారాజ్ కూడా రామజన్మభూమి ఆలయంలో రాముడి విగ్రహం బాల రాముడి రూపంలో ఉండాలని.. తల్లి కౌసల్య ఒడిలో ఉండాలని సూచించారు. కానీ ప్రతిష్ఠాపన చేస్తున్న విగ్రహం మాత్రం చిన్నపిల్లాడిలా కనిపించడం లేదన్నారు.
Read Also:Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు..
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై నిర్వాణి అఖారాకు చెందిన మహంత్ ధర్మదాస్ అభ్యంతరం వ్యక్తం చేసిన పోస్ట్తో పాటు దిగ్విజయ్ ఒక వార్తా వీడియోను కూడా పంచుకున్నారు. కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చిందో వారిని మాత్రమే గర్భగుడిలో ప్రతిష్ఠించాలని ధర్మదాస్ అన్నారు. అయోధ్య వివాదంలో పక్షపాతిగా ఉన్న ధర్మదాస్ పాత విగ్రహానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. పాత విగ్రహం స్థానంలో మరో విగ్రహాన్ని ఎవరూ ఏర్పాటు చేయకూడాదని అన్నారు. రామనగరి అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో ఉన్న గ్రాండ్ రామ్ టెంపుల్ గర్భగుడిలో గురువారం రామలాలా విగ్రహాన్ని దాని పీఠంపై ప్రతిష్ఠించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ గర్భగుడిలో రాంలాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 అంగుళాల విగ్రహం నలుపు రంగులో ఉండి రెండు టన్నుల బరువు ఉంటుంది. ప్రస్తుతం విగ్రహాన్ని పసుపు గుడ్డతో కప్పి ఉంచారు.
Read Also:WTC Table 2025: డబ్ల్యూటీసీలో అగ్రస్థానానికి ఆస్ట్రేలియా.. భారత్కు ఇంగ్లండ్ సిరీస్ కీలకం!
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!