Mallikarjun Kharge : ప్రధాని జపాన్ పోయినప్పుడల్లా నోట్ల రద్దు.. అదేందో మరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెండు వేల రూపాయల నోట్లు రద్దు చేయడంపై విపక్ష నేతల విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే…. ప్రధాని నరేంద్ర మోడీ చర్యలపై మండిపడ్డారు. ప్రధాని మోదీ జపాన్కు వెళ్లినప్పుడల్లా ‘నోట్ బందీ’ నోటిఫికేషన్ వస్తుందని ఖర్గే ఎద్దేవా చేశారు. గతంలో 2016లో రాత్రికి రాత్రే రూ.500, రూ.1,000 నోట్లను డీమోనిటైజేషన్ చేశారన్నారు. అప్పుడూ జపాన్కు వెళ్లినప్పుడే రూ.1,000 నోటు రద్దు జరిగిందనీ, ఈసారి మళ్లీ జపాన్ కు వెళ్లినప్పుడు రూ.2,000 నోటు రద్దు చేశారంటూ ఖర్గే మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం (మే 19) హిరోషిమా చేరుకున్నారు . ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మూడు దేశాలను దర్శించనున్నారు. జపాన్ అనంతరం పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియాకు వెళ్లున్నారు.
Read Also:Tollywood Anchors: మాల్దీవుల్లో వెకేషన్స్.. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది పాపలు
Also Read
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
ఖర్గే ఈ సారి నోట్ల రద్దును “సెంకడ్ డీమోనిటైజేషన్”గా అభివర్ణించారు. ఇది తప్పుడు నిర్ణయానికి తెరలేపుతుందా? లేదా?..అనేది నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు వెల్లడవుతాయని ట్వీట్లో పేర్కొన్నారు. మొత్తం అసంఘటిత రంగాన్ని సర్వనాశనం చేసిన మొదటి పెద్ద నోట్ల రద్దుతో మీరు ఆర్థిక వ్యవస్థకు తీవ్ర గాయం చేశారు. MSMEలను నిలిపివేశారు. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారని ఖర్గే ట్వీట్ చేశారు. కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య, ఆయన మంత్రివర్గం ప్రమాణస్వీకారం అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. దేశానికి మేలు చేస్తుందో, నష్టమో ఆయనకు (పీఎం) తెలియదని, మోదీ చేసిన ‘నోటు రద్దు’ ఈసారి కూడా చేయడం ,ప్రజలను ఇబ్బంది పెట్టబడమేనని అన్నారు. కర్ణాటకలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ‘ప్రేమ ప్రభుత్వం’గా పేర్కొంటూ.. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఐదు వాగ్దానాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య శనివారం బెంగళూరులో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
Read Also:Pawan Kalyan: ‘బ్రో’.. అసలే ఎండాకాలం.. నువ్వు మరింత హీట్ పెంచేస్తున్నావ్
తాజావార్తలు
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!