Bharat Ratna: అతిక్ అహ్మద్కు భారతరత్న ఇవ్వాలి : కాంగ్రెస్ అభ్యర్థి
Bharat Ratna: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత దేశమంతా అతని గురించే చర్చిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో అతను అతిక్ అహ్మద్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ ప్రకటనే అతడికి సమస్యలను తెచ్చిపెట్టింది. తన సొంత పార్టీ అతడిని బహిష్కరించింది.
Read Also: Badri @23 years: పవన్ కల్యాణ్ నటించిన సెన్సేషనల్ హిట్ బద్రికి 23ఏళ్లు
Also Read
- Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!
- AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
- SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ 'నో-లుక్' షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
రాజ్కుమార్ సింగ్ అలియాస్ రజ్జు భయ్యా మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రయాగ్రాజ్ నుంచి పోటీ చేశారు. అయితే వివాదాస్పద ప్రకటనతో ఆయనను పార్టీ నుంచి తొలగించబడ్డారు. అతని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అతిక్ అహ్మద్ అమరవీరుడని.. అతనికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో పాటు యోగి ప్రభుత్వంపై హత్యా ఆరోపణలు చేశాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించి, అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంది. రజ్జు ప్రకటన వ్యక్తిగతమని, పార్టీకి ఆయనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. రాజ్కుమార్ సింగ్ క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో, పార్టీ మున్సిపల్ ఎన్నికలకు రజ్జు అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంది.
Read Also:TPCC Protest event: నిరుద్యోగ సభ రద్దు కాలేదు.. కొత్త డేట్ ఇదే..
ఉమేష్ పాల్ హత్య కేసులో పోలీసు కస్టడీలో ఉన్న అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్, ఏప్రిల్ 15 రాత్రి కెల్విన్ హాస్పిటల్ వెలుపల హత్యకు గురయ్యాడు. అతిక్ అహ్మద్ కొడుకును పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అతిక్ భార్య కూడా పరారీలో ఉండడంతో ఆమె కోసం గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరుడుగట్టిన నేరస్థుడు అతిక్ అహ్మద్, అతని తమ్ముడు అష్రఫ్లకు మద్దతుగా మహారాష్ట్రలో బ్యానర్లు వెలిశాయి. బీడ్ సిటీలో వేసిన ఈ పోస్టర్లలో మాఫియా సోదరులిద్దరినీ అమరవీరులుగా పేర్కొంటున్నారు. దీని గురించి సమాచారం అందుకున్న మహారాష్ట్ర పోలీసులు వెంటనే బీడ్లోని మజల్గావ్ చౌక్ లో ఈ పోస్టర్ను తొలగించారు. పోస్టర్లు వేసిన నలుగురు నిందితులను రెండు మతాల మధ్య విద్వేషాలు సృష్టించినందుకు 293, 294, 153 సెక్షన్ల కింద అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!
-
AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
-
Union Bank Recruitment 2026: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1865 పోస్టులు.. మంచి జీతం
-
Pat Cummins: వాళ్లిద్దరూ అరివీర భయంకరులు.. ఐయామ్ సేఫ్ బాబోయ్.. కమ్మిన్స్ కీలక వ్యాఖ్యలు!
-
SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ ‘నో-లుక్’ షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
ట్రెండింగ్
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?