CI Anju Yadav: సీఐ అంజు యాదవ్కు వరుస షాక్లు.. డీజీపీ వరకు వెళ్లిన వ్యవహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CI Anju Yadav: జనసేన లోకల్ లీడర్పై చేయి చేసుకుని చెంపలు వాయించిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన సర్కిల్ ఇన్స్ప్టెక్టర్ అంజు యాదవ్.. సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయారు.. ఇక, సీఐ అంజు యాదవ్పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మా పార్టీ నేత సాయిపై చేయి చేసుకున్నారు.. శ్రీకాళహస్తి వచ్చే తేల్చుకుంటామంటూ ప్రకటించారు.. మరోవైపు సీఐ అంజు యాదవ్పై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. జనసేన పార్టీకి చెందిన నేత సాయి మహేష్ పై సీఐ అంజు యాదవ్ చేయి చేసుకోవడం, దురుసుగా ప్రవర్తించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. డిజిటల్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దీనిపై కథనాలు రావడం.. వివిధ పత్రికల్లో ఫొటోలు, వార్తల ప్రచురితం కావడంతో.. వాటిని మానవ హక్కుల సంఘం పరిశీలించి సుమోటో గా స్వీకరించింది. ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని మానవ హక్కుల సంఘం ఆదేశించింది.
Read Also: Bhagavanth Kesari : అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో తెరకెక్కుతున్న బాలయ్య సినిమా..?
Also Read
- Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
- UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
- Polavaram-Banakacherla: పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్కు కేంద్రం బ్రేక్.. ప్రతిపాదన వెనక్కి
- Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
మరోవైపు ఈ వ్యవహారం డీజీపీ వరకు వెళ్లింది.. సీఐ అంజుయాదవ్ పై డీజీపీకి ఫిర్యాదు చేశారు టీడీపీ నేత వర్ల రామయ్య.. రాష్ట్రంలో ఒకవర్గం పోలీసులు అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపించిన ఆయన.. ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను టార్గెట్ చేసి వారిని చిత్రహింసలకు గురిచేస్తూ దోషులను మాత్రం ప్రీగా వదిలిపెడుతున్నారని విమర్శించారు.. మరికొంతమంది పోలీసులు ప్రజలపై దాడులు చేస్తూ చట్టఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొట్టే సాయి అనే జనసేన నేతను సిఐ అంజుయాదవ్ నడిరోడ్డుపై చెంపలుపై కొట్టి అవమానించారు. అంతేకాకుండా, జనసేన నేతను కాలర్ పట్టుకుని పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లారు.. అధికారపార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా అంజుయాదవ్ గతంలోను దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. 2022 సెప్టెంబర్ లో ధనలక్ష్మీ అనే మహిళపై సైతం అంజుయాదవ్ తన జులం ప్రదర్శించారు.. అప్పుడు అంజుయాదవ్ దాడిలో గాయపడిన ధనలక్ష్మీ హాస్పిటల్ పాలైంది… అంజుయాదవ్ లాంటి పోలీసుల దురుసు ప్రవర్తనతో రాష్ట్రంలో పోలీసుల ప్రతిష్ట రోజురోజు దిగజారుతోందని ఆరోపించారు. ఇటువంటి పోలీసుల ప్రవర్తనతో పౌరులకు రాజ్యాంగంలో ప్రసాధించిన ప్రాధమిక హక్కులకు భంగం కలుగుతోందని.. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వర్ల రామయ్య.
తాజావార్తలు
-
Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
-
Chiranjeevi: ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి.. అసలు నిజం ఇదే!
-
UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
-
Star Kids: ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ రిజల్ట్ స్టార్ వారసులకు హెచ్చరికేనా?
-
Polavaram-Banakacherla: పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్కు కేంద్రం బ్రేక్.. ప్రతిపాదన వెనక్కి
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!