NTV Telugu Site icon

HYDRA : అమీన్ పూర్, పటేల్ గూడ, కూకట్ పల్లి కూల్చివేతల వివరాలు ప్రకటించిన కమిషనర్‌

Hydra

Hydra

ఈ రోజు చేపట్టిన కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వివరాల ప్రెస్ నోట్ విడుదల చేశారు. కూకట్ పల్లిలోని నల్లచెరువు సర్వే నెం. 66, 67, 68, 69లోని అనధికారికంగా నిర్మించిన షెడ్లను కూల్చివేశామన్నారు. 16 కమర్షియల్ షెడ్లు, ప్రహారి గోడల కూల్చివేత కూకట్ పల్లి నల్లచెరువు పరిధిలో 4 ఎకరాల స్థలం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు సర్వే నెం.164లో మూడు భవనాలు కూల్చివేసినట్లు, వాణిజ్య పరంగా వాడుతున్న ఐదు అంతస్తుల భవనాలు కూల్చివేసినట్లు తెలిపారు. కిష్టారెడ్డిపేట లో ఒక ఎకరం ప్రభుత్వం స్థలం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పటేల్ గూడలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన నిర్మాణాల తొలగించినట్లు, సర్వే నెం. 12/2, 12/3 లోని 25 నిర్మాణాల కూల్చివేసిన్టలు ప్రకటనలో తెలిపారు. పటేల్ గూడలో 3 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నట్లు, మూడు ప్రాంతాల్లో దాదాపు 8 ఎకరాలు ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్ తో కలిసి కూల్చివేతలు జరిగినట్లు, నీటి వనరుల సంరక్షణ కోసం సంయుక్తంగా కృషి చేస్తున్నామన్నారు. నివాసం కోసం నిర్మించుకున్న భవనాలను కూల్చివేయలేదని, వ్యాపారం కోసం నిర్మించిన వాటిని మాత్రమే తొలగించామని ప్రకటనలో తెలిపారు.

UP: 49 మంది నేరస్థుల ఎన్‌కౌంటర్‌, 7015 మంది అరెస్ట్.. 7.5 ఏళ్లలో యూపీ ట్రాక్ రికార్డ్