Physical Harassment: కదులుతున్న కారులో కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
Physical Harassment: రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. త్రిపురకు చెందిన ఒక కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. పశ్చిమ త్రిపుర జిల్లాలో కదులుతున్న కారులో కళాశాల విద్యార్థినిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం విషమ స్థితిలో ఉన్న ఆమెను పశ్చిమ త్రిపురలోని అమాతలి బైపాస్ వద్ద వదలిపెట్టి పరారయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఈ దారుణ ఘటన జరిగింది. ఈఘటనలో ప్రధాన నిందితుడైన గౌతమ్ శర్మ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు బుధవారం అతడిని ప్రశ్నించడం ప్రారంభించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన నిందితుడు గౌతం శర్మ (26), నేరం చేసిన వాహనం డ్రైవర్ సుదీప్ చెత్రి (31) సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే అరెస్టు చేశారు. కాగా, మూడో నిందితుడు మహేశ్ కాలా ప్రాంతానికి చెందిన ప్తాడెన్జిత్ పాల్ (26)ను గురువారం అరెస్టు చేశారు.
సోమవారం రోజంతా ఆ బాలిక ప్రధాన నిందితుడితో కలసి వాహనంలోనే తిరుగుతూ కనిపించిందని, అయితే సోమవారం రాత్రి ఏకాంతంగా ఉండడం చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ప్రధాన నిందితుడు ఆమెను అమాతలి బైపాస్ సమీపంలో వదిలి పరారయ్యాడని సబ్డివిజనల్ పోలీసు అధికారి ఆశిష్ దాస్గుప్తా బుధవారం మీడియాకు తెలిపారు. ఆ బాలిక తరచు ప్రధాన నిందితుడితో మాట్లాడుతూ ఉండేదని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఆమెపై అత్యాచారానికి పాల్పడింది ఒకరా లేక మరికొందరా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. కాగా, జీబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత త్రిపురలో విద్యార్థులు, మహిళా సంఘాలతో సహా వివిధ సంస్థలు గురువారం నిరసన ప్రదర్శనలు నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ త్రిపుర శివార్లలోని తన కళాశాల నుండి తిరిగి వస్తుండగా 20 ఏళ్ల విద్యార్థిని సోమవారం మధ్యాహ్నం అపహరణకు గురైంది.
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
Read Also: Tihar Jail: 90 మంది తీహార్ జైలు అధికారులు ట్రాన్స్ఫర్.. గ్యాంగ్స్టర్ హత్య తరువాత కీలక పరిణామం
బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కాలేజ్ నుంచి ఇంటికి తిరిగివస్తున్న ఆమె కుమార్తెకు ఒక యువకుడు కారులో లిఫ్టు ఇవ్వచూపాడు. అందుకు అంగీకరించిన ఆమె కుమార్తె కారులో ఎక్కగా అందులోనే ఉన్న ముగ్గురు యువకులు ఆమెపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న ఆ బాలికను అమాతలి బైపాస్ వద్ద వదిలి పారిపోయారు. బంధువులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న బాలిక తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలిసిన వెంటనే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపయ్య దత్తా, బీజేపీ మహిళా మోర్చా నాయకులు ఆస్పత్రికి వెళ్లి బాధితురాలి ఆరోగ్యం గురించి విచారించారు. ముఖ్యమంత్రి మాణిక్ సహా ఆదేశా ల మేరకే తాము బాధితురాలి వద్దకు వెళ్లినట్లు దత్తా తెలిపారు. ఈ సంఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి అండగా బీజేపీ ఉంటుందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!