CM YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాయకరావుపేటలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద బాబు దుష్ప్రచారం చేస్తున్నారని.. ప్రతి ఒక్కరికీ కాల్ చేసి, మెసేజ్ పెట్టి జగన్ మీ భూములు కాజేస్తాడని చెబుతున్నాడని తీవ్రంగా మండిపడ్డారు. జగన్ ఎలాంటి వాడో బాబుకు తెలీదేమో రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకూ తెలుసన్నారు. జగన్ భూములు ఇచ్చేవాడు కానీ తీసుకునేవాడు కాదు అని అందరికీ తెలుసన్నారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి బాబుకు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. మీ భూముల మీద మీకు సర్వహక్కులూ కల్పించడమే ఈ యాక్ట్ ఉద్దేశమన్నారు. 100 సంవత్సరాల క్రితం బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగిందని.. ఆ తర్వాత సర్వే జరగలేదన్నారు. గ్రామ సచివాలయాల్లో 15 వేల సర్వేయర్లను పెట్టించి ఇలా సర్వే గతంలో ఎవ్వరూ చేయించలేదన్నారు.
ఆ సర్వే లేక భూములన్నీ సబ్ డివిజన్ జరక్క, భూముల కొలతలు సరిగ్గా లేక అమ్ముకోడానికి కొనుక్కోడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కోర్టుల చుట్టూ, రెవెన్యూ అధికారుల చుట్టు తిరుగుతూ, డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ పరిస్థితి మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద సంపూర్ణ హక్కు ఇవ్వాలని ప్రతి గ్రామంలో రీ సర్వే చేయించామన్నారు. వాళ్ల భూముల మీద సర్వ హక్కులూ వాళ్లకి ఇవ్వడానికి బౌండరీస్ నాటించి, రికార్డులన్నీ అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ రిజిస్ట్రేషన్ చేసి మళ్లీ రైతులకు ఇచ్చే కార్యక్రమం జరుగుతోందన్నారు. ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ దాని మీద కూడా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: ముంబై మ్యాచ్లో వైభవ్ మ్యాజిక్.. ఖాతాలోకి మరో రికార్డు.!
- Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
- Heatwave Workout Tips: వేసవిలో జిమ్ ప్రియులారా జాగ్రత్త..! ఈ తప్పులు చేస్తే ప్రమాదంలో పడ్డట్టే..!
- KKR vs DC: చివరి లీగ్ మ్యాచ్లో దుమ్మురేపిన ఢిల్లీ.. కేకేఆర్పై భారీ విజయం.!
మే 13న కురుక్షేత్ర యుద్ధం మళ్ళీ జరగబోతోందని.. ఈ యుద్ధం జగన్కు, చంద్రబాబుకు మధ్య కాదని.. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరగుతుందన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపు.. మళ్ళీ మోసపోవడమేనన్నారు. మీరేసే ఓటు ఐదేళ్ల అభివృద్ధిని, పేదల భవిష్యత్తును నిర్ణయించేదని ఆయన తెలిపారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే కొండ చిలువ నోట్లో తల పెట్టినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. బాబును ఓడించడానికి పేదలను, విలువలను, విశ్వసనీయతను గెలిపించడానికి మీరంతా సిద్ధమేనా అంటూ పేర్కొన్నారు. మనం చేసిన పథకాలు చూసి చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోందని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో గతంలో ఎన్నడూ చూడని విప్లవం తీసుకుని వచ్చాం కనుక చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోందన్నారు. మూడు వేల రూపాయల పెన్షన్ కానుక, విద్యావ్యవస్థ కీలక మార్పులు విప్లవం అవునా, కాదా అని ప్రశ్నించారు. జగన్కు ఓటేస్తే పథకాలు కొనసాగింపు….బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపు అని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు పాలనలో ఒక్క మంచి కూడా ప్రజలకు గుర్తు లేదన్నారు. చంద్రబాబు మోసాలు, అబద్ధాలకు రెక్కలు కడుతున్నాడన్నారు. 14ఏళ్ల ముఖ్య మంత్రిగా వున్న చంద్రబాబు పెన్షన్ ఇంటికి తీసుకుని వెళ్లి ఇవ్వాలని ఎందుకు అనుకోలేదని సీఎం జగన్ ప్రశ్నించారు. పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది చంద్రబాబేనని.. అవ్వా తాతల నుంచి వ్యతిరేకత వచ్చే సరికి నా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు.
తాజావార్తలు
-
Kamakshi: “సెక్స్ను బూతులా ఎందుకు చూస్తారు?”.. కామాక్షి స్ట్రాంగ్ స్టేట్మెంట్
-
Vaibhav Sooryavanshi: ముంబై మ్యాచ్లో వైభవ్ మ్యాజిక్.. ఖాతాలోకి మరో రికార్డు.!
-
Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
-
Irumudi: ‘ఇరుముడి’లో షాకింగ్ గెటప్లో రవితేజ.. ఫ్యాన్స్కు ఊహించని సర్ప్రైజ్!
-
Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!