100 Jio towers: ఒకేసారి 100 జియో టవర్లు ప్రారంభం.. మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
100 Jio towers: ఒకే సారి 100 జియో టవర్లను ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమం జరిగింది.. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలను అందించడమే లక్ష్యంగా ఈ టవర్లను ఏర్పాటు చేసింది జియో.. ఈ రోజు ఒకేసారి 100 జియో టవర్లను ప్రారంభించారు సీఎం.. ఈ టవర్ల ద్వారా 209కు పైగా మారుమూల గ్రామాలకు 4జీ సేవలు అందనున్నాయి.. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైయస్సార్ కడప జిల్లాలో 2 టవర్లను ఏర్పాటు చేశారు.. ప్రస్తుతం ఈ టవర్ల దర్వారా 4జీ సేవలు అందనుండగా.. భవిష్యత్తులో 5జీ సేవలను అప్గ్రేడ్ చేయడం ప్లాన్గా పెట్టుకుంది రిలయన్స్ జియో..
Read Also: Harish Rao-KTR: సిద్దిపేటలో ఐటీ హబ్.. ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు
Also Read
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- 6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
ఇక, కొత్తగా ప్రారంభించిన సెల్టవర్ల ద్వారా మారుమూల ప్రాంతాల నుంచి నేరుగా సీఎం వైఎస్ జగన్తో వర్చువల్గా పాల్గొన్నారు ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు.. ఆయా ప్రాంతాల్లోని గిరిజనులతో ఇంటరాక్ట్ అయిన ముఖ్యమంత్రి.. ఈ ప్రాజెక్టు కింద కొత్తగా 2,704 ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటు చేయడంగా లక్ష్యంగా ఉండగా.. దీనికోసం ఇప్పటికే 2,363 చోట్ల స్థలాలు జియోకు అప్పగించింది ఏపీ ప్రభుత్వం. డిసెంబర్ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయడం టార్గెట్గా పెట్టుకున్నారు.. కాగా, భారత్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినా.. అవి సిటీలు, పట్టణాలకే పరిమితం అయ్యాయి.. అయితే, మారుమూల ప్రాంతాలు 2జీకే పరిమితం అయ్యాయి.. కొన్ని ప్రాంతాల్లో ఆ సేవలు కూడా లేవు.. ఇప్పుడు రిలయన్స్ జియో సహకారంతో మారుమూల ప్రాంతాల్లో సైతం 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
తాజావార్తలు
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
-
India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!