CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
- సీఎం విజయ్ లండన్ పర్యటనపై తీవ్ర దుమారం
- త్రిషతో కలిసి విదేశాలకు వెళ్లడంపై విపక్షాలు ఫైర్
- ప్రజాధనంతో విదేశాల్లో షికార్లు చేస్తున్నారని విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తొలి విదేశీ పర్యటనలో భాగంగా లండన్లో పర్యటిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ త్రిషతో కలిసి లండన్లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. పెట్టుబడుల కోసం లండన్కు వెళ్తున్నట్లు చెప్పి.. ప్రజాధనంతో విదేశాల్లో షికార్లు చేస్తారా? అంటూ ప్రతిపక్ష పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. త్రిషతో కలిసి పెట్టుబడులకు వెళ్లడమేంటి? అని నిలదీస్తున్నాయి.
ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి విజయ్ పర్యటనపై విమర్శలు గుప్పించారు. విజయ్ను ఎద్దేవా చేస్తూ.. తాను తమిళనాడు ముఖ్యమంత్రి లండన్ పర్యటన ఫొటోలను చూశానని.. అందులో ఒక్క పారిశ్రామికవేత్త కూడా లేరని పళనిస్వామి ధ్వజమెత్తారు. పెట్టుబడుల కోసం లండన్ వెళ్లారని చెబుతున్నారని.. అసలు అలాంటి సమాచారం లేదని ఎద్దేవా చేశారు.
Also Read
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్గా మారిన స్వీట్!
- Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
బీజేపీ ధ్వజం..
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కూడా విజయ్ పర్యటనను ప్రశ్నించారు. విజయ్తో పాటు లండన్లో పర్యటిస్తున్న వారి గురించి స్పష్టత కోరారు. మిషెలిన్ లే మాన్స్ కప్ రేసులో విజయ్తో పాటు నటి త్రిష ఎందుకు కనిపించిందని ప్రశ్నించారు.
‘‘పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశంతో సీఎం విజయ్ లండన్ పర్యటనను 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అధికారికంగా ప్రకటించారు. ఐదు రోజులు గడిచినా పెట్టుబడులకు సంబంధించిన ఒక్క సమావేశం గానీ.. కార్యక్రమం గానీ వాస్తవంగా జరిగినట్లు అధికారిక సమాచారం ఏదీ లేదు. నటుడు అజిత్ కుమార్ పాల్గొన్న ఒక కార్ రేసులో ముఖ్యమంత్రి కనిపించిన కార్యక్రమాన్ని మాత్రమే మేము చూశాము. టెలివిజన్ ఛానెళ్లు, సోషల్ మీడియాలో ప్రసారమైన ఫుటేజీలో మంత్రి అధవ్ అర్జున, నటి త్రిష కనిపించారు. పెట్టుబడిదారులు మాత్రం కనిపించలేదు.’’ అని బీజేపీ నాయకుడు నారాయణన్ తిరుపతి అన్నారు.
CM Vijay, actress Trisha, and Minister Aadhav Arjuna watching the car race.. https://t.co/jfwtHPRZoz
— Pokkiri_Victor (@Pokkiri_Victor) September 12, 2026
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!