CM Revanth: మత ప్రాతిపదికన ఏ రిజర్వేషన్లు ఉండవు.. రాహుల్ గాంధీ సూచనలను అమలు చేయడమే మా లక్ష్యం..!
- సర్ధార్ సర్వాయి పాపన్నకు సముచిత గౌరవం ఇవ్వడమే తమ ప్రభుత్వ ధ్యేయం.
- మత ప్రాతిపదికన ఏ రిజర్వేషన్లు ఉండవు..
- రాహుల్ గాంధీ సూచనలను అమలు చేయడమే మా లక్ష్యం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సర్ధార్ సర్వాయి పాపన్నకు సముచిత గౌరవం ఇవ్వడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. సర్ధార్ పాపన్న విగ్రహం ఏర్పాటు కోసం శంకుస్థాపన నిర్వహించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వం హుస్నాబాద్లోని పాపన్న కోటను లీజుకు ఇచ్చిందని, తాము అయితే ఆ కోటను సంరక్షించడానికి చర్యలు ప్రారంభించామని వెల్లడించారు. హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ను పోటీ చేయించడం కూడా అదే భావనలోనుంచే జరిగిందని అన్నారు. సీఎం రేవంత్ గాంధీ కుటుంబాన్ని “దేశానికి గొప్ప వరం”గా అభివర్ణిస్తూ.. వారిచ్చే హామీ శిలాశాసనం లాంటిదేనని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ సూచించినట్లుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ దిశగా రాష్ట్రవ్యాప్తంగా కుల గణనను నిబద్ధతతో పూర్తి చేసామని, తాము చేసిన సర్వేలో తప్పు ఎక్కడ ఉందో చూపించమని అసెంబ్లీలోనే సవాల్ చేశామని ఆయన పేర్కొన్నారు.
Also Read
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తీసుకున్న రాజకీయ, న్యాయ చర్యలను సీఎం వివరించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపినప్పటికీ అది ఐదు నెలలుగా పెండింగ్లో ఉందని చెప్పారు. తాము తెచ్చిన ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారని, కేంద్ర స్థాయిలో దానికి ఆమోదం వచ్చేలా చూడాల్సిన కేంద్ర నేతలు వాదనలతో కాలం గడుపుతున్నారని ఆక్షేపించారు. 2018లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన చట్టమే ప్రస్తుతం 50 శాతం దాటి రిజర్వేషన్లు ఇవ్వడంలో అడ్డంకిగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
Mumbai Rains: జలదిగ్బంధంలో ఆర్థిక రాజధాని.. జనజీవనం అస్తవ్యస్తం
అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ.. మత ప్రాతిపదికన ఏ రిజర్వేషన్లు ఉండవని స్పష్టం చేశారు. తాము పంపిన బిల్లు గానీ, ఆర్డినెన్స్ గానీ మతాధారిత రిజర్వేషన్లను ప్రతిపాదించలేదని సీఎం స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడమే లక్ష్యంగా “ముస్లిం” పేరుతో వాదనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. మైనార్టీల రిజర్వేషన్లు ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్ ఎలా అమలులో ఉన్నాయో కేంద్రం పరిశీలించాలని, అక్కడ తొలగించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీపై కోపం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవచ్చని, కేసులు పెట్టవచ్చని.. కానీ, ఆయన నమ్మిన బీసీ సాధికారత సిద్ధాంతాన్ని దెబ్బతీయొద్దని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో బీసీలు ముందుకు రావడం రాహుల్ గాంధీ లక్ష్యమని, ఆ సూచనలను అమలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
-
Gorilla Viral Video: సేమ్ టు సేమ్.. మనిషిలా గొరిల్లా ఎక్స్ప్రెషన్స్.. వీడియో వైరల్..!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి