CM Revanth Reddy: ఈ నెల 28న వరంగల్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వరంగల్ నగరం అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృష్టి సారించనున్నారు. కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ఈనెల 28న హనుమకొండ కలెక్టరేట్లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కుడా పరిధిలో చేపట్టబోయే అండర్ డ్రైనేజీ పనులతో పాటు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వరంగల్లోనే సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
Read Also: CM Revanth Reddy: కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
28వ తేదీన జరిగే సమీక్ష సమావేశానికి కావలసిన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని అధికారులకు సీఎంవో ఆదేశించింది. అండర్ డ్రైనేజీ పనులు, ఎంజీఎం హాస్పిటల్ అభివృద్ధి.. నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులతో పాటు కూడా పరిధిలో ఉన్న పెండింగ్ పనులపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.