ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా.. తన ఎంపీ పదవికి రాజీనామా సమర్పించేందుకు పార్లమెంట్ కు వెళ్లారు. అక్కడ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రాజీనామాను సమర్పించారు. కాగా.. సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ స్పీకర్ దగ్గరకు తీసుకుని వెళ్లారు. కాగా.. రేపు అసెంబ్లీలో మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం, ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండటంతో.. రాత్రికి తిరిగి హైదరాబాద్ రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదిలా ఉంటే.. శాఖల కేటాయింపు పై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు రేపు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Big Breaking: ఎంపీ పదవికి రాజీనామా సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth