CM Revanth Reddy: నా దగ్గర ఉన్న శాఖలే కొత్త మంత్రులకు ఇస్తా.. ఒక్కడినే నిర్ణయం తీసుకోలేను కదా?
- మూడు రోజులుగా ఢిల్లీలోసీఎం రేవంత్ రెడ్డి
- నా దగ్గర ఉన్న శాఖలే కొత్త మంత్రులకు ఇస్తా
- నేను ఢిల్లీకి ఎందుకొచ్చానంటే?
- ఒక్కడినే నిర్ణయం తీసుకోలేను కదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన దగ్గర ఉన్న శాఖలే కొత్త మంత్రులకు ఇస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్కు వెళ్లగానే అందరితో సంప్రదించి కొత్త మంత్రుల శాఖలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పనిభారం ఎక్కువైందని ఏ మంత్రి అయునా చెప్తే అప్పుడు ఆలోచిస్తానన్నారు. మంత్రుల శాఖల మార్పులు, చేర్పులపై తాను ఒక్కడినే అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకోలేనన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని సీఎం తెలిపారు. మూడు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే.
ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘నా దగ్గర ఉన్న శాఖలే కొత్త మంత్రులకు ఇస్తాను. హైదరాబాద్కు వెళ్లగానే అందరితో సంప్రదించి కొత్త మంత్రులకు శాఖలకు కేటాయిస్తాను. పనిభారం ఎక్కువైందని ఏ మంత్రి అయినా నాకు చెప్తే అప్పుడు ఆలోచిస్తాను. ఇక్కడ మీకో విషయం చెప్పాలి.. మంత్రుల శాఖల మార్పులు, చేర్పులపై నేను ఒక్కడినే అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకోలేను. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి లేకుండా.. మంత్రుల శాఖల మార్పులు, చేర్పులపై ఎలా నిర్ణయం తీసుకుంటాం’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
Also Read
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
Also Read: Ponnam Prabhakar: నా క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించండి.. విత్తనాలు ఫ్రీగా ఇస్తా!
‘తెలంగాణలో విజయవంతంగా పూర్తి చేసిన కుల గణనపై మేము పాటించిన విధానాన్ని కర్నాటకకు తెలియజేయడానికి నేను ఢిల్లీకి వచ్చాను. నాతో సహా కర్నాటక సీఎం, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కేసి వేణుగోపాల్, రాహుల్ గాంధీ సమావేశమయ్యాం. కుల గణనలో కుల జనాబా లెక్కింపు ఒక అంశం మాత్రమే. వాస్తవానికి కుల గణన అన్నది సామాజిక, ఆర్ధిక, విద్య, రాజకీయ సర్వే. స్థానిక సంస్థల్లో మేం చేసిన కుల గణన ప్రకారమే 42 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది’ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
-
Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు…
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!