CM Revanth Reddy : నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి
- మారుమూల పల్లెలకు వైద్య సేవలు అందిస్తాం
- మెడికల్ కాలేజీలకు నిధులు లోటు రానివ్వం
- టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ లేకుండా గొప్ప డాక్టర్లు కాలేరు : సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రూ.130 కోట్లతో నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాల, హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి , రూ.26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.40 కోట్లతో 100 పడకల యూనిట్ కు, రూ.296 కోట్లతో తుంకిమెట్ల నారాయణపేట రోడ్, కొత్తకొండ మద్దూర్ రోడ్ అభివృద్ధి పనులకు, అప్పకపల్లి గుండామల్ రోడ్, మద్దూర్ లింగాల్ చెడ్ రోడ్ లలో హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రూ.193 కోట్లతో గుల్బర్గా కొడంగల్, రావులపల్లి మద్దూరు, కోస్గి దౌలతాబాద్ రోడ్ల అభివృద్ధి పనులకు, రూ.12.70 కోట్లతో నారాయణపేట నియోజకవర్గంలో సిఆర్ఆర్ రోడ్లకు శంకుస్థాపన చేశారు.
Skoda : బాంబే హైకోర్టు కీలక నిర్ణయం.. 12 వేల కోట్లు చెల్లించనున్న స్కోడా.. అసలేమైంది?
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
అంతేకాకుండా.. రూ.56 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల అకడమిక్ బ్లాకులను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. రూ.5.58 కోట్లతో నిర్మించిన ధన్వాడ, నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ భవనాలను సీఎం రేవంత్ ప్రారంభించారు. రూ.1.23 కోట్లతో జిల్లా మహిళా సమాఖ్య నిర్వహించే పెట్రోల్ బంక్ ను, రూ.7 కోట్లతో మరికల్ మండల పరిషత్ ఆఫీసు కాంప్లెక్స్ భవనంను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మారుమూల పల్లెలకు వైద్య సేవలు అందిస్తామన్నారు. మెడికల్ కాలేజీలకు నిధులు లోటు రానివ్వమని, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ లేకుండా గొప్ప డాక్టర్లు కాలేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వైద్య వృత్తి అనేది ఉద్యోగం కాదు అదో బాధ్యత అని, వైద్యసేవ అనేది మానవత్వంతో చేయాల్సిన డ్యూటీ అని ఆయన వ్యాఖ్యానించారు. అద్దాల మేడలు, రంగుల మేడలు అభివృద్ధి కాదని అంబేద్కర్ అన్నారని, పేదలకు నాణ్యమైన వైద్యం అందాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!