NTV Telugu Site icon

CM Revanth Reddy : తెలంగాణ ప్రజా పాల‌న దినోత్సవ వేడుకలకు హాజరుకావలని కేంద్రమంత్రులకు సీఎం ఆహ్వానం

Cm Revanth

Cm Revanth

తెలంగాణ ప్ర‌జా పాల‌న దినోత్స‌వ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రుకావాలంటూ.. కేంద్ర మంత్రులు అమిత్ షా, గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్‌, కిష‌న్ రెడ్డి, సంజ‌య్‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఈ నెల 17వ తేదీన నిర్వ‌హించ‌నున్న తెలంగాణ ప్ర‌జా పాల‌న దినోత్స‌వం కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రుకావాలంటూ న‌లుగురు కేంద్ర మంత్రుల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేర‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌, కేంద్ర గ‌నుల శాఖ మంత్రి జి.కిష‌న్ రెడ్డి, కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌ల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం లేఖ‌లు పంపించారు. 1948, సెప్టెంబ‌రు 17న తెలంగాణ‌లో ప్ర‌జాస్వామిక పాల‌న శ‌కం ఆరంభ‌మైన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని తెలంగాణ ప్ర‌జా పాల‌న దినోత్స‌వం నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. హైద‌రాబాద్ నాంప‌ల్లి ప‌బ్లిక్ గార్డెన్స్‌లో జ‌రిగే కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావాల‌ని కేంద్ర మంత్రుల‌ను ముఖ్య‌మంత్రి కోరారు.

Satyakumar Yadav: రాష్ట్ర ఆయుష్ విభాగానికి భారీ స్థాయిలో కేంద్ర నిధులు.. ఫ‌లించిన మంత్రి కృషి