CM Revanth Reddy : నిజామాబాద్ అంటే నాకు ప్రత్యేక అభిమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ అంటే నాకు ప్రత్యేక అభిమానమన్నారు. మూతపడిన చక్కెర కర్మాగారం తెరిచేందుకు విధి విధానాల కోసం శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నియమించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17లోగా చక్కెర కర్మాగారం తెరిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. వందరోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తామని కేసీఆర్ మోసం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. వరి వేస్తే ఉరే అని చెప్పిన చరిత్ర కేసీఆర్ ది.. అందుకే కేసీఆర్ ను రాజకీయంగా వందమీటర్ల గోతి తీసి పాతిపెట్టారని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’నిజామాబాద్ రైతులను మోసం చేస్తే శాశ్వతంగా రాజకీయ సమాధి చేస్తామని ఇక్కడి రైతులు నిరూపించారు.. బండిని, గుండును నమ్మరని గత ఎన్నికల్లో ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తామని బాండ్ పేపర్ రాసిచ్చారు… స్పైసెస్ బోర్డును తెచ్చి అదే పసుపు బోర్డు అని చెబుతున్నారు… స్పైసెస్ బోర్డుకు పసుపు బోర్డుకు తేడా తెలియదా మా నిజామాబాద్ రైతులకు? హర్యానా రైతుల తరువాత ఆర్మూర్, నిజామాబాద్ రైతులకే ఆ పౌరుషం ఉంది.. ప్రభుత్వం మెడలు వంచి వారి సమస్యలను పరిష్కరించుకునే సత్తా రైతులకు ఉంది.. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది… జీవన్ రెడ్డి ని గెలిపిస్తే… సోనియమ్మ, రాహుల్ గాంధీని ఒప్పించి.. జీవన్ అన్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చేలా చేసే బాధ్యత నాది… కేంద్ర మంత్రిగా పసుపుబోర్డు తీసుకొచ్చి జీవన్ అన్న నిజామాబాద్ రైతుల కోరిక తీరుస్తారు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచిపెడతారని ప్రధాని మాట్లాడుతున్నారు.. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రధాని మోదీ..మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు.. ప్రధాని మోదీకి ఓటమి భయం పట్టుకుంది… ఓటమి భయంతోనే ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి రాజకీయ లబ్ది పొందాలని చూడటం మంచిదా?
Also Read
- 2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..
- CJP: బర్గర్ వివాదం.. సీజేపీ అధికార ప్రతినిధి తొలగింపు..
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
దేవుడు గుడిలో ఉండాలి… భక్తి గుండెల్లో ఉండాలి… కేవలం ఎన్నికల్లో గెలుపు కోసం ఇలాంటి కుట్రలు చేయడం దేశానికి మంచిది కాదు… రాముడు మీకే కాదు… మాకూ దేవుడే.. నేను హిందువునని గర్విస్తా.. ఇతర మతాలను గౌరవిస్తా… బాసర సరస్వతీ దేవి సాక్షిగా చెబుతున్నా… పంద్రాగస్టులోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసే బాధ్యత మాది.. జీవన్ రెడ్డిని గెలిపించి నిజామాబాద్ గౌరవాన్ని నిలబెట్టండి… ప్రశ్నించే గొంతును పార్లమెంటుకు పంపండి… జీవన్ అన్నకు వేసే ప్రతీ ఓటు మీ రేవంతన్నకు వేసినట్లే..’ అని సీఎం రేవంత్ రెడ్డి.
తాజావార్తలు
-
2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..
-
CJP: బర్గర్ వివాదం.. సీజేపీ అధికార ప్రతినిధి తొలగింపు..
-
Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
-
Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!