NTV Telugu Site icon

CM Revanth Reddy: ఆదిలాబాద్‌ జిల్లాలో నేడు రేవంత్ రెడ్డి పర్యటన

Revanthreddy

Revanthreddy

CM Revanth Reddy: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుని నామినేషన్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం డైట్ కళాశాలలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభలో రేవంత్ సమక్షంలో పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం ఉంది. డైట్ కళాశాల మైదానంలో బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ ఆదిలాబాద్‌కు రానున్నారు. ఇక్కడ సభ తరువాత నిజామాబాద్‌కు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Read Also: PM Modi: నేడు అలీఘర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన..

కాగా ఆత్రం సుగణ.. మొన్నటి వరకు ప్రభుత్వ టీచర్‌గా విధులు నిర్వర్తించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ తరపున ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మొదటి నుంచి వామపక్ష భావజాలానికి ఆకర్షితులైన సుగణ.. అనేక ప్రజా ఉద్యమాల్లో తన వంతు పాత్ర పోషించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ యాక్టివ్‌గా పాల్గొన్నారు. సాధారణ టీచర్ అయిన సుగుణకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ దక్కటంపై అనేక వర్గాల నుంచి అభినందలు వెల్లువెత్తుతున్నాయి.