Monthly Pension: పెళ్లికాని వారికి పెన్షన్ ఇచ్చేది అప్పటి నుంచే.. క్లారిటీ ఇచ్చిన సీఎం..!
మనం ఇప్పటి వరకు వితంతువులకు, వృద్ధులకు, దివ్యాంగులు పెన్షన్లు ఇవ్వడం చూశాం.. కానీ గత కొన్ని రోజులుగా నిరుద్యోగులకు భృతి ఇస్తామనే హామీ దేశంలో చక్కర్లు కొడుతుంది. నిజానికి ఇది పాలిటిక్స్ లో ఒక ట్రెండుగా మారింది. ఎక్కడ ఎన్నికలు జరిగినా, నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రతి పార్టీ మేనిఫెస్టోలో పెడుతుంది. ఇక ఇదే వరుసలో మరో ట్రెండ్ వస్తుంది. అదేనండి పెళ్లికాని వారికి నెలవారి పెన్షన్ ఇస్తామని హర్యానా ప్రభుత్వం తెలిపింది. ఆడవారైనా, మగవారైనా.. ఎవరికైనా ఈ పథకం వర్తిస్తుందని ఇవాళ (గురువారం) ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది.
Also Read: Early Elections in Andhra Pradesh: ఏపీలో మందస్తు ఎన్నికలు..? క్లారిటీ ఇచ్చిన సజ్జల
Also Read
- Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
- Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
- Bengal Repolling: పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..
- UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
ఈ పథకం వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ వెల్లడించారు. అయితే దీనికి కొన్ని షరతుల్ని ఆయన ప్రకటించారు. వయసు 45 దాటి 60 ఏళ్ల లోపు వారికి ఈ పథకం వర్తిస్తుందన్నాడు. అలాగే వారి వార్షికాదాయం రూ. 1.8 లక్షల లోపు ఉండే వారికి నెలకు 2,750 రూపాయల పెన్షన్ అందజేయనున్నట్లు ఖట్టర్ తెలిపారు. వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించని అదే వయస్సు గల వితంతువులకు, భార్య చనిపోయిన వారికి కూడా ఈ పెన్షన్ వర్తిస్తుందని సీఎం చెప్పారు.
Also Read: NDA Meeting: జూలై 18న ఎన్డీఏ మీటింగ్.. కలిసి వెళ్లేది ఎవరు..?
అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న లాజిక్ను సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలియజేశారు. ఒంటరి పురుషుడు, స్త్రీ విషయంలో కొన్ని వ్యక్తిగత అవసరాలు ఉన్నాయి. ఈ నెలవారీ పెన్షన్తో ప్రభుత్వం వైపు నుంచి కొంత ఆర్థిక సహాయం వారికి అందాలని ఆయన అన్నారు. పెన్షన్ స్కీమ్తో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 240 కోట్లను భరిస్తుందని చెప్పారు.
Also Read: Man Attack on Shopkeeper : దోశ వేయలేనన్న మహిళపై దాడి..
అయితే, హర్యానాలో దాదాపు 65,000 మంది పెళ్లికాని స్త్రీ, పురుషులు ఉన్నాట్లు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇక నిర్దిష్ట వయస్సుగల వితంతువులు/భార్య చనిపోయిన మగవారు 5,687 మంది ఉన్నారని ఆయన అన్నారు. వీరందరికి ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. ఈ లబ్ధిదారులకు 60 ఏళ్లు నిండిన తర్వాత వృద్ధాప్య పింఛను పథకానికి సంబంధించిన వార్షిక ఆదాయ వివరాలను సమర్పిస్తే.. అప్పటి నుంచి వారు వృద్ధాప్య పింఛను పొందుతారని సీఎం ఖట్టర్ చెప్పారు.
తాజావార్తలు
-
Buchi Babu: ‘పెద్ది’ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
-
Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
-
Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
-
Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. ‘పెద్ది’ లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్
-
Bengal Repolling: పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!