Monthly Pension: పెళ్లికాని వారికి పెన్షన్ ఇచ్చేది అప్పటి నుంచే.. క్లారిటీ ఇచ్చిన సీఎం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం ఇప్పటి వరకు వితంతువులకు, వృద్ధులకు, దివ్యాంగులు పెన్షన్లు ఇవ్వడం చూశాం.. కానీ గత కొన్ని రోజులుగా నిరుద్యోగులకు భృతి ఇస్తామనే హామీ దేశంలో చక్కర్లు కొడుతుంది. నిజానికి ఇది పాలిటిక్స్ లో ఒక ట్రెండుగా మారింది. ఎక్కడ ఎన్నికలు జరిగినా, నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రతి పార్టీ మేనిఫెస్టోలో పెడుతుంది. ఇక ఇదే వరుసలో మరో ట్రెండ్ వస్తుంది. అదేనండి పెళ్లికాని వారికి నెలవారి పెన్షన్ ఇస్తామని హర్యానా ప్రభుత్వం తెలిపింది. ఆడవారైనా, మగవారైనా.. ఎవరికైనా ఈ పథకం వర్తిస్తుందని ఇవాళ (గురువారం) ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది.
Also Read: Early Elections in Andhra Pradesh: ఏపీలో మందస్తు ఎన్నికలు..? క్లారిటీ ఇచ్చిన సజ్జల
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
ఈ పథకం వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ వెల్లడించారు. అయితే దీనికి కొన్ని షరతుల్ని ఆయన ప్రకటించారు. వయసు 45 దాటి 60 ఏళ్ల లోపు వారికి ఈ పథకం వర్తిస్తుందన్నాడు. అలాగే వారి వార్షికాదాయం రూ. 1.8 లక్షల లోపు ఉండే వారికి నెలకు 2,750 రూపాయల పెన్షన్ అందజేయనున్నట్లు ఖట్టర్ తెలిపారు. వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించని అదే వయస్సు గల వితంతువులకు, భార్య చనిపోయిన వారికి కూడా ఈ పెన్షన్ వర్తిస్తుందని సీఎం చెప్పారు.
Also Read: NDA Meeting: జూలై 18న ఎన్డీఏ మీటింగ్.. కలిసి వెళ్లేది ఎవరు..?
అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న లాజిక్ను సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలియజేశారు. ఒంటరి పురుషుడు, స్త్రీ విషయంలో కొన్ని వ్యక్తిగత అవసరాలు ఉన్నాయి. ఈ నెలవారీ పెన్షన్తో ప్రభుత్వం వైపు నుంచి కొంత ఆర్థిక సహాయం వారికి అందాలని ఆయన అన్నారు. పెన్షన్ స్కీమ్తో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 240 కోట్లను భరిస్తుందని చెప్పారు.
Also Read: Man Attack on Shopkeeper : దోశ వేయలేనన్న మహిళపై దాడి..
అయితే, హర్యానాలో దాదాపు 65,000 మంది పెళ్లికాని స్త్రీ, పురుషులు ఉన్నాట్లు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇక నిర్దిష్ట వయస్సుగల వితంతువులు/భార్య చనిపోయిన మగవారు 5,687 మంది ఉన్నారని ఆయన అన్నారు. వీరందరికి ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. ఈ లబ్ధిదారులకు 60 ఏళ్లు నిండిన తర్వాత వృద్ధాప్య పింఛను పథకానికి సంబంధించిన వార్షిక ఆదాయ వివరాలను సమర్పిస్తే.. అప్పటి నుంచి వారు వృద్ధాప్య పింఛను పొందుతారని సీఎం ఖట్టర్ చెప్పారు.
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో పాత క్యాలెండర్లు ఇంకా ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఇది మంచిదేనా?
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!