Iftar Party : చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం పోరాడాలి : కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iftar Party : దేశం కోసం ప్రతి ఒక్కరూ చివరి రక్తపు బొట్టు వరకు పోరాడాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో సర్కార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని కేసీఆర్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిదేళ్ల కిందట తెలంగాణ అంటే వెనుకబడింది అనేవారు. ఇప్పుడు అభివృద్ధిలో దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రం లేదన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్గా నిలిచింది. అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలిచిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీలకు పదేళ్లలో కాంగ్రెస్ ఖర్చు చేసింది కేవలం రూ. 1200 కోట్లు మాత్రమే.
Read Also: Wealth of CMs: 30 మంది సీఎంలలో 29 మంది కోటీశ్వరులే.. టాప్లో జగన్ మోహన్ రెడ్డి
Also Read
కానీ తెలంగాణ సర్కార్ మైనార్టీల కోసం గత తొమ్మిదేళ్లలో రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం అని తెలిపారు. మనం అభివృద్ధి చెందుతున్నంతగా మిగతా రాష్ట్రాల్లో అభివృద్ధి లేదు. తాగు, సాగు నీరు, కరెంట్ సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి ఘనస్వాగతం లభించింది. దేశం కూడా మనలాగే అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ఇఫ్తార్ విందులో మంత్రులు మహముద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సానియా మీర్జా, ముస్లిం మతపెద్దలతో పాటు 13 వేల మంది ముస్లింలు పాల్గొన్నారు. ముస్లిం చిన్నారులకు కేసీఆర్ రంజాన్ కానుకలు అందించారు. సీఎం కేసీఆర్ నిఖత్ జరీన్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..