Kottu Satyanarayana : రేపు పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం.. ఈనెల 12 నుంచీ రేపటి వరకూ జరగనున్నాయి అని దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. రేపటి పూర్ణాహుతితో యజ్ఞం ముగియనుంది. రేపు పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఏ ఇబ్బందులు లేకుండా 5 రోజులూ నిర్విఘ్నంగా యజ్ఞం జరిగింది అని తెలిపారు.
Also Read : Ahiteja Bellamkonda: ఒక్క సినిమా ఫ్లాప్ అయితే మిమ్మల్ని చూసే వాడే లేడిక్కడ
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
అమ్మవారి అనుగ్రహంతో అందరి సమన్వయంతో యజ్ఞం జరిగిందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఎండను లెక్కజేయకుండా భక్తులు వచ్చారు.. రేపు మహా పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది.. రాజశ్యామల, మహాలక్ష్మీ యాగశాలల్లో సీఎం రేపు పాల్గొంటారు అని ఆయన వెల్లడించారు. 10:45 కి సీఎం అభిషేకానికి చేరుకుంటారు..కంచి నుంచీ తెచ్చిన వస్త్రాలు అమ్మవారికి సీఎం జగన్ అందజేస్తారని ఆయన చెప్పారు. స్వరూపానంద స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి, మంత్రాలయ పీఠాధిపతి, అహోబిల జీయర్ స్వామి రేపు వస్తున్నారు.. చిన్నజీయర్ స్వామి కూడా వస్తారని ఆశిస్తున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
Also Read : Perni Nani : చెప్పులు లేకుండా ఎండలో నడిచిన వృద్ధురాలు.. షోరూంకు తీసుకెళ్లిన పేర్ని నాని
యజ్ఞదీక్ష తీసుకున్న దంపతులు కృష్ణానదిలో స్నానం చేసి, వేదాశీర్వచనం తీసుకుంటారు.. రేపు వేలాదిమందిగా వచ్చే భక్తులకు అన్న ప్రసాదం అందిస్తామని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ప్రధాన రాజగోపురం ద్వారా దర్శనం చేసుకునేలా 180 కోట్లతో చేసే అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రెడీ చేశామని ఆయన అన్నారు. ఈ అభివృద్ధికి టెండర్ లు కూడా పూర్తయ్యాయి..మాస్టర్ ప్లాన్ సీఎం జగన్ కు చూపించి అనుమతులు పొందుతామని మంత్రి కొట్టు తెలిపారు. ప్రెస్ మీట్లు పెట్టి యజ్ఞం గురించి కామెంట్లు చేసిన మూర్ఖులు కూడా రాష్ట్రంలో ప్రజలే..తెలివైన వాళ్ళం అనుకుని తెలివిక్కువగా మాట్లాడేవాళ్ళని పట్టించుకోనక్కర్లేదు అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!