CM Jagan : నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించి వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి పంపనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 9.55 గంటలకు మార్కాపురం చేరుకుంటారు. తొలుత ఎస్వీకేపీ డిగ్రీ కళాశాల మైదానంలో 10.15 గంటల నుంచి 12.05 గంటల వరకు జరిగే బహిరంగ సభలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రసంగిస్తారు. అనంతరం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి నగదు జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం 12.40కి అక్కడి నుంచి బయలుదేరి 1.35కి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది.
Also Read : Telangana Congress: అప్పుడు మద్దతు తెలిపి ఇప్పుడు పోరాటం చేస్తామంటే ఎలా
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
2023-2024 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ను సమర్పించిన ఏపీ ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా నవరత్నాలు నిరంతర అభివృద్ధిపై బలమైన ప్రతిబింబాన్ని కలిగి ఉన్నాయని ఉచ్ఛరించింది. బడ్జెట్ను సమర్పిస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి దార్శనికత సంక్షేమ ఎజెండాలో మెరుగైన సామాజిక భద్రత, రైతుల ఆర్థికాభివృద్ధి, మహిళా సాధికారత, బడుగు బలహీన వర్గాల ఆదరణకు పెద్దపీట వేస్తోందన్నారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి రూ.610 కోట్లు కేటాయించారు. ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, వైశ్య, వెలమ మరియు రెడ్డి వంటి కులాల మహిళలకు సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈబీసీ నేస్తం అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. లబ్ధిదారులకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తారు. 45-60 సంవత్సరాల వయస్సు గల మహిళలకు సంవత్సరానికి 15,000 అందిస్తారు.
Also Read : MCU: ఉమెన్ పవర్… సరికొత్త సూపర్ హీరోస్ టీమ్ అప్ అవుతున్నారు
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!