Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Jagan Mohan Reddy Powe Punches On Pawan And Babu

CM JaganMohan Reddy: పొలిటికల్ పంచ్‌ లు.. పవన్, బాబుపై విసుర్లు

Published Date :October 20, 2022 , 1:02 pm
By NTV WebDesk
CM JaganMohan Reddy: పొలిటికల్ పంచ్‌ లు.. పవన్, బాబుపై విసుర్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

అవనిగడ్డ సాక్షిగా జగన్ వరాలు ప్రకటించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు చేసిన మంచి ఏంటో చెప్పుకోలేరు. బూతులు తిట్టడం మామూలుగా లేదు. చెప్పులు చూపిస్తూ.. దారుణమయిన బూతులు మాట్లాడుతుంటే.. ఇలాంటి వారు మన నాయకులా, బాధ అనిపిస్తుంది. మొన్ననే దత్త పుత్రుడితో దత్త తండ్రి ఏమని మాట్లాడిస్తున్నాడో మనం చూస్తున్నాం. మనం ఎవరికీ అన్యాయం చేయకుండా.. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూస్తున్నాం. మూడు రాజధానులు వద్దని.. మూడు పెళ్ళిళ్ల వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారు. మీరూ చేసుకోండి అని టీవీల్లో నాయకుల్లా చెప్పుకుంటున్నవారు ఇలా మాట్లాడుతుంటే ఏం చేయాలి?

మన ఇంట్లో మూడు నాలుగు పెళ్ళిళ్లు చేసుకోమంటే ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఏం కావాలి? ఇలాంటి వారా మన నాయకులని ఆలోచన చేయాలి. దశ, దిశ చూపగలరా? మంచి చేసిన చరిత్ర లేనివారు, వెన్నుపోటు దారులు, రంగురంగుల మేనిఫెస్టోలు ఇస్తారు. వాగ్దానాలు మరిచిపోతారు.. మేనిఫెస్టోలు కనిపించకుండా చేస్తారు. ఆ పార్టీ వెబ్ సైట్ లో మేనిఫెస్టో కనిపించదు. పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ సీఎం జగన్.. మూడు రాజధానులు కాదు.. మూడు పెళ్ళిళ్ళు చేసుకోమంటే వ్యవస్థ ఏమైపోతుంది.. ఒక్క జగన్ ని కొట్టడానికి ఇంత మంది ఏకమవుతున్నారంటే ఆశ్చర్యం అనిపిస్తుందన్నారు. ఇలాంటి వారిపై పోరాటం సాగుతుంది. 19 నెలల్లో ఈ పోరాటం నడుస్తుంది. దేవుడి దయ వుంది.

Also Read

  • IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..
  • Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
  • Donald Trump: ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్‌‌ను టార్గెట్ చేసిన ట్రంప్..!
  • CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్‌లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..

మంచి జరిగిన కుటుంబం వారు నాకు అండగా వుంటారు. అబద్ధాలు, మోసాలు, కుతంత్రాలు, మీడియా, పొత్తులను నమ్ముకుంటే నేను అక్కచెల్లెళ్ళను నమ్ముకున్నాను. పేదవాడికి, పెత్తం దారులకు మధ్య జరుగుతున్న యుద్ధం.. ఇది సామాజిక న్యాయానికి, సమాజాన్ని, ముక్కలు చెక్కలు చేయాలని వారిపై జరిగే యుద్ధం. ఇలాంటి వారిని దూరంగా వుంచండి. రాబోయే రోజులలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ టీవీలు చూడవద్దు, పేపర్లు చదవద్దు. మీ ఇంట్లో మంచి జరిగితే జగనన్నకు తోడుగా నిలబడండి. దత్తపుత్రుడు, మీడియా లేకపోయినా మీ అండ కావాలి. ప్రజలంతా నాకు తోడుగా నిలబడతారని నాకు నమ్మకం ఉంది

నేను దత్త పుత్రుడిని, మీడియాను నమ్ముకోలేదు. మంచికి, మోసానికి మధ్య జరుగుతున్న యుద్ధం. సామాన్యుడికి, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం. వచ్చే రోజుల్లో ఈ కుట్రలు, కుతంత్రాలు మరింత పెరుగుతాయి. మీడియాని కాదు మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేదే ప్రామాణికంగా తీసుకోండి. మీకు మంచి జరిగితే నాకు మద్దతుగా నిలబడండి అన్నారు జగన్.

అంతకుముందు అవనిగడ్డలో రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. 35 వేల ఎకరాలు రైతులదేనని సీఎం జగన్‌ చెప్పారు.. భూములపై సీఎం జగన్‌ అన్ని హక్కులు కల్పించారు.భూమి రైతన్నకు ఒక సెంటిమెంట్‌. రైతన్నకు ఒక హోదాను సీఎం జగన్‌ కల్పించారు. 35 వేల ఎకరాలను గడిచిన ప్రభుత్వం సర్కారు భూమి అని పెట్టింది. ప్రభుత్వ భూమి కాదు.. 90 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతాంగానిదే భూమి అని సీఎం జగన్‌ ఆర్డర్‌ ఇచ్చారు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలి. రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలో పెద్ద మార్పులు తీసుకొస్తాం అన్నారు మంత్రి ధర్మాన.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 3 capitals
  • AP Elections
  • ap future
  • Avanigadda
  • chandrababu

తాజావార్తలు

  • IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..

  • LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..

  • Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..

  • KTR: రంగుల సినిమా చూపించి రేవంత్ అధికారంలోకి వచ్చాడు

  • Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్‌ప్లే + 7200mAh

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions