CM Chandrababu: బదిలీలపై సీఎం కసరత్తు.. సీఎంవో, సీఎస్, డీజీపీతో భేటీ
- పరిపాలనలో ప్రక్షాళన ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
- సచివాలయంలో సీఎంవో.. సీఎస్.. డీజీపీలతో సమావేశం
- ఐఏఎస్.. ఐపీఎస్ వంటి అధికారుల బదిలీలపై కసరత్తు
- గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికారుల జాబితా ఇప్పటికే సిద్ధం
- సమర్థులైన అధికారులు.. నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగులు ఇవ్వడంపై ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: పరిపాలనలో ప్రక్షాళన ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. అందులో భాగంగా సచివాలయంలో సీఎంవో, సీఎస్, డీజీపీలతో సమావేశం అయ్యారు.. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారుల బదిలీలపై కసరత్తు ప్రారంభించారు.. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికారుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసింది ఏపీ సీఎంవో.. అయితే, సమర్థులైన అధికారులకు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగులు ఇవ్వడంపై ఫోకస్ పెట్టారు.. ఇదే సమయంలో.. గత ప్రభుత్వంలో వైసీపీతో అంటకాగిన వారిని దూరంగా పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశారు ప్రభుత్వ పెద్దలు. ఈ నేపథ్యంలో.. ప్రవీణ్ ప్రకాష్, శశి భూషణ్, అజేయ్ జైన్, శ్రీలక్ష్మీ, గోపాల కృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని జీఏడీకి రిపోర్ట్ చేయమంటారని చర్చ సాగుతోంది..
Read Also: Mr Bachchan : రవితేజ ‘మిస్టర్ బచ్చన్ ‘ మూవీ స్పెషల్ అప్డేట్ వైరల్..
Also Read
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- 185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
ఇక, సీనియర్ ఐపీఎస్లు రాజేంద్రనాధ్ రెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, ఎన్. సంజయ్, సునీల్ కుమార్ వంటి వారిపై బదిలీ వేటు పడే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది.. మరోవైపు.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై కేసులు కూడా నమోదు చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉందనే ప్రచారం సాగుతోంది.. 5 హామీలపై అమలుపై ప్రణాళికతో, వేగంగా పని చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. నిర్ణయం వెలువడిన తరువాత జాప్యం ఉండకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.. టీటీడీ ప్రక్షాళనతో పని మొదలు పెట్టిన చంద్రబాబు. టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తప్పించి.. ఈవోగా సీనియర్ ఐఏఎస్ శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చిన విషయం విదితమే కాగా.. అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. దీంతో.. అధికారుల్లో గుబులు పుట్టుకుంది.. తామకు ఏ శాఖ వస్తుంది.. తమకు ఎక్కడికి పంపుతారనే టెన్షన్లో అధికారులు ఉన్నారు.
తాజావార్తలు
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!