CM Chandrababu: తెలుగుదేశం పార్టీ.. తెలుగింటి ఆడపడుచుల పార్టీ!
- అసెంబ్లీలో మహిళా సాధికారత అంశం
- మహిళలను దృష్టిలో పెట్టుకునే సంక్షేమ పథకాలు
- ఆస్తిలో మహిళలకు సమాన వాటా ఇచ్చింది ఎన్టీఆర్
- రిజర్వేషన్స్ అమలైతే 70-75 మంది మహిళా ఎమ్మెల్యేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగుదేశం పార్టీ తెలుగింటి ఆడపడుచుల పార్టీ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా.. మహిళలను దృష్టిలో పెట్టుకునే చేశామన్నారు. ఆస్తిలో మహిళలకు సమాన వాటా ఇచ్చింది ఎన్టీఆర్ అని తెలిపారు. తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా పనిచేశారని మండిపడ్డారు. రిజర్వేషన్స్ అమలైతే 70-75 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటారన్నారు. అమెరికా లాంటి దేశాలలో కూడా మహిళలకు సమానత్వం లేదని, సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతో ఉందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. మహిళా సాధికారత అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడారు.
‘మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది. సంక్షేమం, అభివృద్ధి.. ఏదైనా మహిళలను దృష్టిలో పెట్టుకుని చేస్తాము. మహిళా సాధికారతపై మాటలు చెప్పడం వేరు.. చేతలు వేరు. మహిళలకు సమాన హక్కులు కల్పించడం అందరి బాధ్యత. ఇప్పటికీ మహిళలు వివక్షకు గురి అవుతున్నారు. మహిళలను చూస్తే ఇప్పటికీ చిన్నచూపు ఉంది. మహిళలు ప్రతి స్టేజ్లో ఎవరో ఒకరిపై ఆధారపడి ఉండే పరిస్థితి. మహిళా సాధికారత టీడీపీ నుంచి మొదలు అయింది. తెలుగుదేశం పార్టీ తెలుగింటి ఆడపడుచుల పార్టీ. మహిళలను దృష్టిలో పెట్టుకునే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఆస్తిలో మహిళలకు సమాన వాటా ఇచ్చింది ఎన్టీఆర్. తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా పనిచేశారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
‘విద్యలో మహిళలను ప్రోత్సహించాలి. మహిళలకు ఇచ్చిన 33 శాతం రిజర్వేషన్తో సెలెక్ట్ అయిన అధికారిణి సూర్యకుమారి. ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. రాష్ట్రపతి ముర్ము, కేంద్ర మంత్రి నిర్మల సీతరామన్ మహిళలకు ఆదర్శంగా ఉన్నారు. రిజర్వేషన్స్ అమలైతే 70-75 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటారు. మగవారి కంటే ఆడవారు చాలా తెలివైన వారు. ఇప్పుడు మహిళలకే ఎదురుకట్నం ఇచ్చే పరిస్థితి వచ్చింది. అమెరికా లాంటి దేశాలలో కూడా మహిళలకు సమానత్వం లేదు. సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో బాలికలకు సైకిళ్లు ఇచ్చి ప్రోత్సహించాము. దీపం 2 కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఆర్టీసీలో పురుష కండక్టర్ల కంటే.. మహిళా కండక్టర్లే బాగా పనిచేస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?