AP Pensions: ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పేరుతో పెన్షన్ల పంపిణీని ప్రారంభించింది ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతోంది.. తాము అధికారంలోకి వస్తే రూ.4 వేల పెన్షన్ అందిస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు.. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అందిస్తున్న తొలి పెన్షన్ ఇదే.. ఇక, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెట్టిన తొలి సంతకాల్లో పెన్షన్ పంపిణీ కూడా ఉన్న విషయం విదితమే.. ఆ తర్వాత కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. గత మూడు నెలలకు రూ.1000 చొప్పున.. ఈ నెల రూ.4000తో కలిపి.. రూ.7,000 పెన్షన్ మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది ప్రభుత్వం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు పెన్షన్ల పంపిణీకి స్వయంగా రంగంలోకి దిగారు సీఎం చంద్రబాబు నాయుడు.. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో సీఎం చంద్రబాబు పెన్షన్ పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.. ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం, మంత్రి.. లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందించారు.. లబ్ధిదారు కుటుంబసభ్యులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు..
Read Also: Parliament: నేటి నుంచి పార్లమెంట్ సెషన్స్ తిరిగి ప్రారంభం.. నీట్, ఈడీలపై చర్చకు విపక్షాల పట్టు..
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పెనుమాకలో స్వయంగా ఇస్లావత్ సాయి అనే మహిళకు వితంతు పెన్షన్, బానావత్ పాములు నాయక్ అనే వ్యక్తికి వృద్ధాప్య పెన్షన్ అందజేశారు.. ఇక, గతం కంటే భిన్నంగా చంద్రబాబు పర్యటన సాగింది.. గ్రామంలో ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు.. గ్రామం లోని యువకులతో ఫొటోలు దిగి భుజం తట్టి పంపించారు.. అనంతరం పెనుమాక గ్రామ ప్రజా వేదిక వద్దకు చేరుకుని.. పెనుమాకలో ప్రజలతో మాటా మంతీ కార్యక్రమంలో పాల్గొన్నారు.. గ్రామస్తుల సమస్య లు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.