AP Pensions: పెన్షన్ల పంపిణీ ప్రారంభం.. స్వయంగా పెన్షన్లు అందించిన సీఎం చంద్రబాబు
- ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని ప్రారంభం..
- పెన్షన్ల పంపిణీకి స్వయంగా రంగంలోకి దిగారు సీఎం చంద్రబాబు నాయుడు..
- మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో పెన్షన్ పంపిణీని ప్రారంభించిన సీఎం..
- లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందించి.. లబ్ధిదారు కుటుంబసభ్యులతో మాట్లాడిన సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Pensions: ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పేరుతో పెన్షన్ల పంపిణీని ప్రారంభించింది ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతోంది.. తాము అధికారంలోకి వస్తే రూ.4 వేల పెన్షన్ అందిస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు.. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అందిస్తున్న తొలి పెన్షన్ ఇదే.. ఇక, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెట్టిన తొలి సంతకాల్లో పెన్షన్ పంపిణీ కూడా ఉన్న విషయం విదితమే.. ఆ తర్వాత కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. గత మూడు నెలలకు రూ.1000 చొప్పున.. ఈ నెల రూ.4000తో కలిపి.. రూ.7,000 పెన్షన్ మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది ప్రభుత్వం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు పెన్షన్ల పంపిణీకి స్వయంగా రంగంలోకి దిగారు సీఎం చంద్రబాబు నాయుడు.. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో సీఎం చంద్రబాబు పెన్షన్ పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.. ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం, మంత్రి.. లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందించారు.. లబ్ధిదారు కుటుంబసభ్యులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు..
Read Also: Parliament: నేటి నుంచి పార్లమెంట్ సెషన్స్ తిరిగి ప్రారంభం.. నీట్, ఈడీలపై చర్చకు విపక్షాల పట్టు..
Also Read
- Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పెనుమాకలో స్వయంగా ఇస్లావత్ సాయి అనే మహిళకు వితంతు పెన్షన్, బానావత్ పాములు నాయక్ అనే వ్యక్తికి వృద్ధాప్య పెన్షన్ అందజేశారు.. ఇక, గతం కంటే భిన్నంగా చంద్రబాబు పర్యటన సాగింది.. గ్రామంలో ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు.. గ్రామం లోని యువకులతో ఫొటోలు దిగి భుజం తట్టి పంపించారు.. అనంతరం పెనుమాక గ్రామ ప్రజా వేదిక వద్దకు చేరుకుని.. పెనుమాకలో ప్రజలతో మాటా మంతీ కార్యక్రమంలో పాల్గొన్నారు.. గ్రామస్తుల సమస్య లు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
-
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
-
Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..